ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ కి మన తెలుగులో మంచి డిమాండ్ ఉంది. పాన్ ఇండియా సినిమాల కోసం ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్ ని మన తెలుగులో తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు స్టార్ హీరోలు దర్శకులు నిర్మాతలు. వారికి అవకాశం ఇవ్వడానికి గానూ ఏ విధంగా కూడా ఆలోచించడం లేదు. ఎంత పారితోషికం అయినా పర్వాలేదు చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని చెప్తున్నారు నిర్మాతలు. కైరా అద్వానీ కి ఇప్పుడు బాలీవుడ్లో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆమెతో సినిమాలు చేసేందుకు మ‌న తెలుగు హీరోలు లొట్ట లేసుకుని మ‌రీ వెయిట్ చేస్తున్నారు.

 

తెలుగులో స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వ‌ర‌కు అంద‌రూ త‌న వెంటే ప‌డుతుండ‌డంతో ఆమె ఇప్పుడు చెట్టు ఎక్కి కూర్చొంది. భారీ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తోంద‌న్న వార్తలు వ‌స్తున్నాయి. ఇక ఇప్పుడు ఇదే కొందరు బాలీవుడ్ హీరోయిన్లకు కళ్ళు నెత్తికి ఎక్కే విధంగా చేసింది అని సమాచారం. అసలు వార్త ఏంటీ అనేది చూస్తే. అనుష్క శర్మను మహేష్ బాబు సినిమాకు అడిగారు. ఆమె సినిమా చేస్తాను గాని 12 రోజులు మాత్రమే డేట్స్ ఇస్తాను అని చెప్పింది. 

 

అందుకు ఓకే అయితే తనకు సినిమా చేయడానికి ఏ విధంగా కూడా ఇబ్బంది లేదని అయితే ఆ 12 రోజులు ఎప్పుడు అనేది చెప్పలేను అని... కాని ఎప్పుడు అయినా సరే వరుసగా ఇవ్వడం మాత్ర౦ కుదిరే పని కాదని ఆమె చెప్పెసినట్టు తెలుస్తుంది. దీనితో మహేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశాడట. ఆమె బదులు పూజ హెడ్గే లేదా కీర్తి సురేష్ ని తీసుకోవాలని ఆమె తనను అవమాని౦చింది అని మహేష్ బాబు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు కాని ఇప్పుడు ఇది సోష‌ల్ మీడియా వ‌ర్గాల్లో బాగా హైలెట్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: