టాలీవుడ్ లో యువ హీరోలు ఇప్పుడు చాలా మంది బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోలతో సినిమాలు చెయ్యాలి అనేది చాలా మంది మన తెలుగు హీరోలకు డ్రీం. అయినా సరే మన తెలుగు హీరోల మీద బాలీవుడ్ హీరోలు అంతగా ఆసక్తి చూపించరు అనేది కూడా మనం వింటూ ఉంటాం. వారి తో కలిసి ఒక సినిమా చేస్తే వారిని కూడా ఇక్కడ పరిచయం చేస్తే మంచి మార్కెట్ అనేది జరుగుతూ ఉంటుంది. కాని మన తెలుగులో మాత్రం ఇప్పుడు కొంత మంది హీరోలు బాలీవుడ్ సినిమాలు అంటేనే చిరాకు పడే సందర్భం కూడా ఉంది అని అంటున్నారు. 

 

జూనియర్ ఎన్టీఆర్ కోసం ఎప్పటి నుంచో బాలీవుడ్ దర్శకులు ట్రై చేస్తున్నారు. అయినా సరే తారక్ మాత్రం ఒకటికి వంద సార్లు ఆలోచించి అప్పుడు సమాధానం చెప్పాలి అని భావిస్తున్నాడు. కథ బాగున్నా సరే బాలీవుడ్ లో ఒకసారి ఎంటర్ అయితే ఆ తర్వాత ఎదుర్కొనే వాటికి కూడా సిద్దంగా ఉండాలని తనకు అంత ఆసక్తి లేదని చెప్తూ ఉంటాడు. బాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ఇప్పుడు మహేష్ బాబు సహా కొందరు హీరోలు చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల బన్సాలి నుంచి ఎన్టీఆర్ కి ఫోన్ వచ్చినా సరే సినిమా చేస్తాను లేదు అనే విషయాన్ని అతనికి అసలు ఏ విధంగా కూడా చెప్పలేదు అని సమాచారం. 

 

కథ విన్నా సరే ఆ కథ నచ్చినా సరే ఆలోచించి చెప్తాను అని తారక్ చెప్పినట్టు సమాచారం. దీనితో ఆయనలో కూడా కాస్త అసహనం అనేది వచ్చింది అంటారు. బాలీవుడ్ లో సినిమాలు చేస్తే తన రేంజ్ ని తగ్గించుకుని అక్కడి వాళ్లకు తగిన విధంగా చెయ్యాలి అనేది అతని భావన గా చెప్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: