యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని ఎనౌన్స్ మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్ లో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు దర్శక నిర్మాతలు. 

 

ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ పెట్టాలని ఫిక్స్ అయ్యారు నిర్మాత అశ్వనీదత్. అందుకే సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ దీపికా పడుకొనేని తీసుకుంటున్నారట. సినిమాలో నటించేందుకు దీపికా కూడా ఓకే చెప్పినట్టు టాక్. అయితే రెమ్యునరేషన్ మాత్రం భారీగా డిమాండ్ చేస్తుందట. ప్రభాస్ సినిమా చేయాలంటే 15 కోట్ల రెమ్యునరేషన్ అడిగిందట ఈ అమ్మడు. అశ్వనీదత్ కూడా అందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. మాములుగా సౌత్ సినిమాల్లో హీరోయిన్స్  కోటి నుండి రెండు కోట్ల వరకే ఇస్తారు. మరి ఎక్కువ బడ్జెట్ అనుకుంటే 3 కోట్లు హయ్యెస్ట్. కానీ ఇలా హీరోల రెమ్యునరేషన్ కు ఈక్వల్ గా ఎక్కడ వసూలు చేయలేదు.     

 

హాలీవుడ్ రేంజ్ లో రాబోతున్న సినిమా కాబట్టి సినిమా కోసం ఎక్కువ రోజులు డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే దీపికా అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చేనందుకు సిద్ధమయ్యారట నిర్మాత అశ్వనీదత్. అదే జరిగితే ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా దీపికా పడుకునే కొత్త రికార్డ్ సృష్టించినట్టే. ఇప్పటికే కథ పూర్తి చేసిన నాగ్ అశ్విన్ లాక్ డౌన్ తర్వాత ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: