జయాపజయలతో సంబందం లేకుండా ఇటీవల వరస సినిమాలను కమిట్ అయ్యాడు మాస్ రాజా రవితేజ. అందులో రమేష్ వర్మ తో చేయాల్సిన సినిమా కూడా వుంది. కరోనా లేకుంటే ఈపాటికే సెట్స్ మీదకు వెళ్లాల్సి వుంది కానీ లాక్ డౌన్ వల్ల వాయిదాపడతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా చేయడానికి రవితేజ ఆసక్తి ని చూపించడంలేదని టాక్.
 
ఈసినిమా స్థానం లో వక్కంతం వంశీ తో చేయనున్న సినిమా ను కానీ త్రినాధరావు నక్కిన తో చేయాల్సిన సినిమా ను కానీ మొదలు పెట్టడానికి రవితేజ సన్నద్ధం అవుతున్నాడట. మరి రమేష్ వర్మ తో చేయాల్సిన సినిమా ను పూర్తిగా పక్కకు పెడతాడో లేదా ఈ సినిమాలు  పూర్తి చేశాకైనా స్టార్ట్ చేస్తాడో చూడాలి. కాగా రవితేజ తో ఇంతకుముందు రమేష్ వర్మ ,వీర అనే సినిమా ను తెరకెక్కించగా ఆ చిత్రం డిజాస్టర్ ఫలితాన్ని రాబట్టింది అయితే గత ఏడాది రాక్షసుడు తో హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు రమేష్ వర్మ. 
 
ఇక ప్రస్తుతం రవితేజ క్రాక్ లో నటిస్తున్నాడు. ఇంకో రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. బలుపు ఫేమ్ గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈచిత్రంలో రవితేజ , పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. బలుపు కూడా  వీరి ముగ్గురి కాంబినేషన్ లోనే తెరకెక్కగా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మరి క్రాక్ కు ఆ సెంటిమెంట్ కలిసొస్తుందో చూడాలి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్  ప్రతినాయకురాలిగా నటిస్తుంది. ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. ఆగస్టు లో ఈ సినిమా ప్రేక్షకులముందుకు వచ్చే అవకాశాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: