తొంభై దశకంలో హిందీ సినిమాల్లో హాట్ హాట్ సన్నివేశాలు, బికినీ స్టిల్స్ తో రాణించిన నటి పూజా బేడీ. తెలుగులో 2011లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన శక్తి సినిమాలో లేడీ విలన్ గానూ నటించింది. ప్రస్తుతం పూజా చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. కాబోయే భర్త మనేక్ కాంట్రాక్టర్ తో కలిసి గోవా వెళ్లిన పూజా బేడిని గోవా అధికారులు అనుమతి లేకుండా వచ్చారంటూ క్వారంటైన్ కు తరలించారు. దీంతో అసంతృప్తికి గురైన పూజా బేడీ అక్కడి సౌకర్యాల్లోని లోపాలను చూపిస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది.

 

 

‘తమను క్వారంటైన్ కు తరలించిన చోట ఎటువంటి పరిశుభ్రత లేదు. పగుళ్లు వచ్చిన గోడలు, దుమ్ము, బూజుతో ఎంతో అపరిశుభ్రత ఉంది. పారిశుద్ధ్య కార్మికులు కూడా ఏదో వచ్చామంటూ వచ్చి పని చేసి వెళ్లిపోతున్నారు. సరిగ్గా శానిటైజ్ చేయడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేదు. ఈ విషయంలో గోవా ప్రభుత్వం విఫలమైంది. కరోనా సోకని వారు ఇక్కడి క్వారంటైన్ గదిలో ఉంటే నిజంగా కరోనా వస్తుంది. ఇక్కడి వైఫల్యాలను గత ట్వీట్ లో ప్రస్తావిస్తే విమర్శించారు. ఈ వీడియో చూశాక ఎలా ప్రతిస్పందిస్తారో మరి’ అంటూ వీడియో పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ ను గోవా సీఎం, ఆరోగ్య శాఖ మంత్రికి ట్యాగ్ చేసింది కూడా.

 

 

గోవా రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలు బాగున్నాయని మంచి పేరు ఉంది. ఇప్పుడు పూజా ఏకంగా క్వారంటైన్ లో లోపాలను వీడియో తీయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. మనేక్ కాంట్రాక్టర్ తో పూజా బేడికి గత ఏడాది ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ ఏడాది వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారు. పూజా ట్వీట్ పై గోవా అధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: