సాధారణంగా ఏ హీరో అయినా సరే వయసు మీద పడుతున్న సమయంలో చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తూ ఉంటారు. నటులు కూడా అంతే తమ వయసు కి తగిన విధంగా పాత్రలు చేస్తూ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్న౦ చేస్తూ ఉంటారు. అయితే కొందరు హీరోలు మాత్రం వయసు మీద పడుతున్నా సరే ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా నటిస్తూ ఉంటారు. మన తెలుగులో చిరంజీవి అదే కోవకు వస్తు ఉంటారు. ఆయన ఏ సినిమా చేసినా సరే ఇప్పుడు మాస్ కి బాగా దగ్గర అయ్యే విధంగానే చేస్తున్నారు. చిరంజీవి సినిమాలను ఎక్కువగా చూసేది వాళ్ళే. 

 

ఇక ఇప్పుడు ఆయన ఆచార్య సినిమా కోసం పడే కష్టం గురించి టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అది ఏంటీ అంటే ఒక నదిలో ఉండే సీన్ లో ఆయన డూప్ లేకుండా చేస్తున్నారు అని సమాచారం. ఒక పడవ మీద నుంచి మరో పడవ మీదకు దూకే సమయంలో చిరంజీవి డూప్ లేకుండా నటించే అవకాశం ఉందని దీనికి సంబంధించి ఇప్పుడు కొన్ని సన్నివేశాలను కూడా ప్లాన్ చేసారని చాలా జాగ్రత్తగా ఆ సీన్ లో చిరంజీవి నటిస్తారు అని సమాచారం. డూప్ ని పెట్టే అవకాశం ఉందని చర్చ జరిగినా సరే చిరంజీవి తానే చేస్తాను అని చెప్పడం తో... 

 

దర్శకుడు కొరటాల శివ మరొకరికి అవకాశం ఇవ్వకుండా ఆయనను ఓకే చేసారు అని రామ్ చరణ్ కూడా నిర్మాతగా... చిరంజీవి ఆ రిస్క్ చేసే అవకాశం వద్దని అనవసరంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అని పేర్కొన్నట్టు సమాచారం. అయినా సరే చిరంజీవి మాత్రం ఎక్కడా భయపడకుండా ఆ సీన్ లో నటించడానికి ఓకే చెప్పారు అని తెలుస్తుంది. ఆ సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: