యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న రౌద్రం రణం రుథిరం సినిమాలో నటిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమరం భీం గా తారక్ నటిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమాని డి వి వి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య భారీ బడ్జెట్ ని కేటాయించి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మోషన్ టీజర్ తో పాటు చరణ్ పాత్రని రివీల్ చేస్తూ వదిల టీజర్ ప్రేక్షకుల్లోనే ఇండస్ట్రీలోను విపరీతమైన ఆసక్తిని పెంచేశాయి.

 

ఇక ఈ సినిమా కంప్లీటవగానే త్రివిక్రం దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు తారక్. ఈ సినిమా తారక్ కి మైల్ స్టోన్ కావడం విశేషం. ఎన్.టి.ఆర్ 30 గా రూపొందబోయో ఈ సినిమాకి అయినను పోయిరావలె హస్తినకు అన్న టైటిల్ ఫిక్స్ చేయగా ఈ ఇయర్ లో సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం ఉందని సమాచారం. అయితే వాస్తవంగా తారక్ బర్త్ డే సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ నుండి అలాగే త్రివిక్రం సినిమా నుండి ఫ్యాన్స్ కి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్స్ వస్తాయనుకున్నారు. కాని లాక్ డౌన్ కారణంగా నిరాశ తప్పలేదు. అయితే అందుకు ప్రత్యామ్నయంగా తారక్ ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్ మాత్రం వచ్చింది.

 

త్రివిక్రం తర్వాత తారక్ నటించబోయో సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఉండబోతుంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కే.జీ.ఎఫ్ చాప్టర్ 2 ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా రిలీజయ్యాక తారక్ సినిమా కోసం పూర్తి కథ ని పక్కాగా సిద్దం చేసే పనిలో పడతాడు. ఈ లోపు తారక్ ఆర్.ఆర్.ఆర్ తో పాటు త్రివిక్రం సినిమాని కంపీట్ చేసి ప్రశాంత్ నీల్ సినిమాలో జాయిన్ అవుతాడట.

 

భారీ పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇదే కాదు ఈ సినిమాతో పాటు తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించే సినిమా కూడా లైన్ లో ఉందని సమాచారం. ఇది కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండబోతుందట. ఇక ఆర్.ఆర్.ఆర్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా తారక్ కి వచ్చే క్రేజ్ ఊహించుకుంటేనే ఎంతో థ్రిల్ గా ఉంటుంది ఫ్యాన్స్ కి.

మరింత సమాచారం తెలుసుకోండి: