ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తరువాత నెంబర్ వన్ స్థానానికి దగ్గరగా ఉన్న నటులు ఎవరు అంటే ఎక్కువమంది నోటి నుండి వినపడే పేర్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు అని అంటున్నారు సినీ విశ్లేషకులు. దాదాపుగా సమానమైన క్రేజ్, మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకెళ్తున్న ఈ ఇద్దరు టాప్ హీరోలు ప్రస్తుతం ఎంతో ఆచి తూచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల వరుసగా మూడు సక్సెస్ లతో సూపర్ స్టార్ మహేష్ దూసుకుపోతుంటే, రెండేళ్ల గ్యాప్ అనంతరం రానున్న సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకోవాలని చూస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 

 

ఇక ఈ ఇద్దరూ కూడా బాక్సాఫీస్ బరిలో కలిసి దిగిన సందర్భాలు చాలా తక్కువే అని చెప్పాలి. ఇప్పటికే పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా చాలావరకు షూటింగ్ జరుపుకోగా, దానితో పాటు చేస్తున్న క్రిష్ సినిమా మాత్రం నలభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు చెప్తున్నారు. అయితే మహేష్ సినిమా మాత్రం ఈ నెల 31 సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ చేసి, లాక్ డౌన్ అనంతరం షూటింగ్ ని మొదలెట్టనున్నట్లు చెప్తున్నారు. పవన్ వకీల్ సాబ్ వాస్తవానికి ఈపాటికి థియేటర్స్ లోకి వచ్చి ఉండాలి. అయితే కరోనా దెబ్బ వలన వాయిదా పడింది. దానితో ఈ సినిమాని లాక్ డౌన్ అనంతరం మిగతా షూటింగ్ పూర్తి చేసి జనవరి లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు టాక్. 

 

ఇక క్రిష్ సినిమా కూడా లాక్ డౌన్ అనంతరం బ్యాలెన్స్ షూటింగ్ మొదలవుతుందని, కాగా ఆ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ అవసరం ఉండడంతో షూటింగ్ మరిన్ని ఎక్కువ రోజులు కొనసాగనుందట. దానిని బట్టి ఈ సినిమా రాబోయే సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉందట. అలానే మహేష్ సినిమా కూడా సరిగ్గా రాబోయే సమ్మర్ సమయానికి థియేటర్స్ లోకి వస్తుందని అంటున్నారు. కాగా ఈ రెండు సినిమాలు కూడా ఒకే సమయంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందట. మరి ఈ వార్తే కనుక నిజం అయితే, ఎప్పుడో కొన్నేళ్ల క్రితం బాక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టిన ఈ ఇద్దరు టాలీవుడ్ కొదమసింహాలు, రాబోయే సమ్మర్ లో మరొక్కసారి బరిలో నిలవడం ఖాయం, అప్పుడు ఎవరు ఎంతమేర సక్సెస్ అందుకుంటారో చూడాలి. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై రెండు సినిమాల నిర్మాతల నుండి అధికారిక సమాచారం రావలసి ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు....!!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: