నేచురల్ స్టార్ నాని తాజాగా మరో సినిమా కు ఓకే చెప్పాడట అయితే ఈ సారి ఓ కొత్త దర్శకుడితో  సినిమా చేయనున్నాడు. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ చెప్పిన  కథ తో సంతృప్తి చెందిన నాని వెంటనే సినిమా ఓకే చెప్పాడట. పడి పడి లేచె మనసు నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈసినిమాని నిర్మించనున్నాడని తెలుస్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. 
 
ఇక నాని ప్రస్తుతం టక్ జగదీష్ లో నటిస్తున్నాడు. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈచిత్రంలో నాని కి జోడిగా రీతూ వర్మ, ఐష్వర్య రాజేష్ నటిస్తుండగా జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నాడు. థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రిన్స్ పతాకం పై సాహు గారపాటి ,హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇటీవలే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది.  ఈఏడాది చివర్లో  ఈ సినిమాను విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
 
ఈసినిమా ను పూర్తి చేసిన తరువాత నాని, టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో 'శ్యామ్ సింగ రాయ్' నటించనున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించనున్నాడని టాక్.  డిసెంబర్ లో ఈసినిమా ను విడుదలచేద్దాం అనుకున్నారు షూటింగ్ ఆలస్యంగా  స్టార్ట్ కానుండడంతో వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. ఇక ఈరెండు సినిమాల కన్నా ముందు వి తో ప్రేక్షకులముందుకు రానున్నాడు నాని. ఇది అతనికి 25వ చిత్రం కాగా మార్చి లోనే విడుదలకావల్సిన ఈచిత్రానికి కరోనా షాక్ ఇచ్చింది.  థియేటర్లు  రీ ఓపెన్ అయిన వెంటనే ఈసినిమా విడుదలచేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: