చిరంజీవి ప్రధాన పాత్రలో రామ్ చరణ్ నిర్మాణ సారధ్యంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా సైరా. ఈ సినిమా మీద ఉన్న అంచనాల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూడటం నుంచి ప్రతీ ఒక్కటి కూడా ఈ సినిమా అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. దాదాపు రెండేళ్లకు పైగా ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ కష్టపడింది. కాని ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఏ విధంగా కూడా ఆకట్టుకోలేదు అనేది వాస్తవం. ఈ సినిమా తర్వాత చిరంజీవి కూడా భయపడ్డారు అని అంటారు టాలీవుడ్ జనాలు. 

 

ఈ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాలు చూసి చాలా మంది చికాకు కూడా పడ్డారు.  ఒక రేంజ్ లో ఉంటుంది అని భావించిన సినిమా చాలా చికాకు పెట్టింది ప్రేక్షకులను అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి చాలా జాగ్రత్త పడి ప్రయోగాలు వద్దు అని భావించారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను బాహుబలి నుంచి కాపీ కొట్టారు అనే ఆరోపణలు కూడా చాలానే వచ్చాయి. ఇక ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలు అయితే తర్వాత చిరంజీవి కూడా చూసి బాధ పడ్డారు ని అంటారు. 

 

సినిమా తర్వాత చిరంజీవి ఇప్పుడు ఆచార్య అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా అయిపోయిన సంగతి తెలిసిందే ఈ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాల కారణంగా సినిమా షూటింగ్ అనేది వాయిదా అపడింది. అన్ని అనుకున్న విధంగా జరిగితే ఈ సినిమాను ఈ ఏడాది దసరా కు విడుదల చేసే వారు. కాని అనుకున్న స్థాయిలో సినిమా మాత్రం ఆకట్టుకోలేదు అనేది అర్ధమైంది. ఇప్పుడు చిరంజీవి చేస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: