పదేళ్ల క్రితం విడుదలైన ఏమాయ చేసావే సినిమా ప్రేమకథా సినిమాల్లో ఐకానిక్ గా నిలిచింది. ద్విబాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో తెలుగులో నాగ చైతన్య, సమంత, తమిళ్ లో శింబు, త్రిష చేశారు. ఇప్పుడు ఈ సినిమా థీమ్ ను బేస్ చేసుకుని ఈ చిత్ర దర్శకుడు గౌతమ్ మీనన్ ఓ షార్ట్ ఫిలిం తీశారు. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో షూటింగ్స్ లేక ఇంట్లోనే ఉన్న కార్తీక్ కథ రాయాలని భావిస్తాడు. నిరాశగా ఉన్న కార్తీక్ కు జెస్సీ గుర్తొస్తుంది. జెస్సీకి కార్తీక్ కాల్ చేయడంతో ఈ షార్ట్ ఫిలిం ప్రారంభమవుతుంది.

 

 

జెస్సీకి కాల్ చేసిన కార్తీక్ ‘ప్రస్తుతం నువ్వు కేరళలో ఉన్నావని తెలుసు. ఫేస్ బుక్ లో చూశాను షూటింగ్స్ లేక పరిస్థితులు తారుమారయ్యాయి. నువ్వు గుర్తొస్తున్నావు. నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి’ అంటాడు. దీనికి జెస్సీ స్పందిస్తూ.. ‘ఐ లవ్ యూ కార్తీక్. యు ఆర్ ఏ బేబీ. నీ మనసు నాకు తెలుసు. కానీ నువ్వు అనుకునేది సాధ్యం కాదు. నీలో ఉండాల్సింది ఇది కాదు. నీలో మంచి రచయత ఉన్నాడు. మంచి కథలు రాయగల తెలివి ఉంది. మంచి సినిమాలు నీ నుంచి వస్తాయి. మళ్లీ ధియేటర్లు ఓపెన్ అవుతాయి. అంతా బాగుంటుంది’ అని ధైర్యం చెప్తుంది జెస్సీ.

 

జెస్సీ మాటలకు రెట్టించిన ఉత్సాహంతో కార్తీక్ కథ రాయడం మొదలుపెట్టడంతో ఈ షార్ట్ ఫిలిం ముగుస్తుంది. ‘కార్తీక్ డయల్ సేతా యెన్’ పేరుతో ఈ షార్ట్ ఫిలిం తీశాడు గౌతమ్. దీనికి రెహమాన్ సంగీతాన్ని అందించాడు. ఎవరి ఇళ్లలో వారు ఉండి ఈ షార్ట్ ఫిలిం తీశారు. శింబు, త్రిష లవ్ మ్యాజిక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: