అల వైకుంఠపురములో సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా సుకుమార్ డైరక్షన్ లో చేస్తున్న విషయం  అంటూ మరో సంచలనానికి సిద్ధమయ్యాడు అల్లు అర్జున్. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టోన్ సినిమాపై అంచనాలు పెంచారు. రంగస్థలం తర్వాత సుకుమార్ కొద్దిపాటి గ్యాప్ తీసుకుని మరి రాసుకున్న ఈ పుష్ప కథ అద్భుతంగా వచ్చిందని తెలుస్తుంది. 

 

ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. మొదట కేవలం తెలుగులోనే రిలీజ్ చేయాలని అనుకున్న ఈ సినిమా ఫుల్ స్క్రిప్ట్ పూర్తయ్యేసరికి పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లిందట. అందుకే ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే సినిమాను ఐదు భాషల్లో రిలీజ్ చేస్తామని వెళ్లడించారు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ మారుతి డైరక్షన్ లో సినిమా చేస్తాడని అంటున్నారు. మారుతి, అల్లు అర్జున్ ఇద్దరు మంచి స్నేహితులు.. అయినా సరే ఇంతవరకు ఇద్దరు కలిసి పనిచేసింది లేదు.  

 

మారుతి కూడా బన్నీకి సూట్ అయ్యే కథ రాసుకుంటే తప్ప ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాడు. లాస్ట్ ఇయర్ చివర్లో ప్రతిరోజూ పండుగే అంటూ వచ్చి సూపర్ హిట్ అందుకున్న మారుతి తన నెక్స్ట్ సినిమా కథ అల్లు అర్జున్ కోసమే సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. బన్నీకి కూడా ఆల్రెడీ లైన్ వినిపించి స్టోరీ డెవెలప్ చేస్తున్నాడట మారుతి. బౌండెడ్ స్క్రిప్ట్ కూడా నచ్చితే మారుతి, బన్నీ సినిమా ఫిక్స్ అయినట్టే లెక్క. ఈ సినిమా కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తారని తెలుస్తుంది. ఈమధ్య మంచి ఫేమ్ లో ఉన్న మారుతి బన్నీ కోసం ఎలాంటి కథ రాశాడో.. ఈ కాంబోలో ఎలాంటి సినిమా వస్తుందో అని మెగా అండ్ అల్లు ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: