మలయాళంలో మోహన్ లాల్ మీనా జంటగా నటించిన సినిమా 'దృశ్యం'. ఈ సినిమా 2013వ సంవత్సరంలో రిలీజ్ అయి సూపర్ సక్సెస్ సాధించింది. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్, మీనా నటించిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. 2013వ సంవత్సరంలో అనేక భాషల్లో 'దృశ్యం' సినిమా రీమేక్ అయ్యి రికార్డులు కూడా సృష్టించింది. హిందీలో, తమిళంలో, కన్నడంలో రీమేక్ అయింది. అన్ని చోట్ల సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు శ్రీలంక భాషలో అదే విధంగా చైనా భాషలో కూడా ఈ సినిమా రీమేక్ అయ్యి అద్భుతమైన విజయాన్ని సాధించడం విశేషం. కొసమెరుపు ఏమిటంటే చైనా భాషలో మొట్టమొదటి భారతీయ రీమేక్ సినిమా 'దృశ్యం'.

 

ఇటువంటి సమయంలో ఈ సినిమాకి సీక్వెల్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో ఈ సినిమాకి సీక్వెల్ ఇటీవల రెడీ అయిందట. ఇటీవల మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా మలయాళం ఇండస్ట్రీలో 'దృశ్యం' సీక్వెల్ సినిమా వార్తలు గురించి రకరకాల కథనాలు వినబడుతున్నాయి. మోహన్ లాల్ ఓకే చేసినట్లు మళ్లీ మీనా కూడా సినిమాలో నటిస్తున్నట్లు లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే ఈ సినిమా ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

 

సినిమా షూటింగ్ కి పర్మిషన్ రాగానే షూటింగ్ మొదలు పెట్టి ఈ ఏడాది చివరిలో గాని వచ్చే ఏడాది ప్రారంభంలోనే దృశ్యం సీక్వెల్ రిలీజ్ వుంటుందని మలయాళం ఇండస్ట్రీ అంటూ ఉంది. వెంకటేష్ కెరియర్ లోనే 'దృశ్యం' సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా. కచ్చితంగా ఈ సినిమా సీక్వెల్ వెంకటేష్ చేస్తే మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నట్లే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరి వెంకటేష్ 'దృశ్యం' సినిమా సీక్వెల్ చేస్తారో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: