మద్రాస్ కేఫ్ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది రాశీఖన్నా. మొదటి సినిమాతోనే మంచి పేరు రావడంతో ఆ తర్వాత వరసగా సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ ఇలా సౌత్ అండ్ నార్త్ లో రాశి ఖన్నా తన సత్తా చాటుతోంది. చెప్పాలంటే టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేసింది ఈ బ్యూటి. అంతేకాదు ఎక్కువ సక్సస్ లను అందుకుంది. టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి ఫాం లో కూడా ఉంది. రీసెంట్ గా సాయి ధరం తేజ్ తో నటించిన ప్రతిరోజు పండగే, అలాగే విజయ్ దేవరకొండ తో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు చేసింది. వాటిలో ఒక సినిమా సూపర్ హిట్ అవగా మరోటి ఫ్లాప్ గా మిగిలింది.

 

అయితే ప్రస్తుతం రాశీఖన్నా టాలీవుడ్ కంటే కోలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేస్తుంది. దాదాపు నాలుగు మంచి ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. ఇన్ని సినిమాలు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ అయిన పూజా హెగ్డే, కన్నడ బ్యూటి రష్మిక మందన్న ల కంటే కూడా తమిళ సినిమాలు రాశీ అకౌంట్ లో ఉండటం విశేషం. కార్తీక్ జి క్రిష్ తెరకెక్కించబోయో షహితాన్ కా బచ్చ సినిమా ఈ పాటికే షూటింగ్ కంప్లీట్ కావాల్సింది. కాని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా కాస్త ఆలస్యంగా మొదలవనుందట.

 

ఇక తాజాగా మూడు ప్రాజెక్ట్స్ ని దక్కించుకుంది. ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో రాబోతున్న అరన్మానై 3 లో నటిస్తుంది. అలాగే సింగం సిరీస్ తో సూర్య కి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన హరి దర్శకత్వంలో రూపొందే సినిమాలో అవకాశం అందుకుంది. ఇక ఈ సినిమాలో సూర్య సరసన నటిస్తుంది. అంతేకాదు ఈ సినిమా సింగ్ సిరీస్ లో వస్తుండటం విశేషం. ఇక ఈ సినిమా తర్వాత పా.విజయ్ దర్శకత్వంలో మేథావి అనే సినిమాలోను నటిస్తుంది. ఇలా మొత్తం రాశీఖన్నా చేతిలో నాలుగు తమిళ సినిమాలున్నాయి. ఈ సినిమాలలో రెండు భారీ సక్సస్ లను అందుకున్నా ఇక కోలీవుడ్ లో రాశీఖన్నా స్టార్ హీరోయిన్ గా సెటిలవడం ఖాయం.    

మరింత సమాచారం తెలుసుకోండి: