ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చితపరిశ్రమ మూతపడింది. థియేటర్స్ మల్టీప్లెక్సెస్ లు క్లోజ్ అయ్యాయి. సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. దీంతో ఫైనాన్షియర్ల దగ్గర నుంచి తెచ్చిన డబ్బుకు వడ్డీలు కట్టలేని ప‌రిస్థితుల‌లో నిర్మాత‌లు త‌మ చిత్రాల‌ని డిజిటల్ ప్లాట్‌ ఫార్మ్ లలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తెలుగులో ‘అమృతరామమ్’ సినిమా నేరుగా ఓటీటీలో విడుద‌ల అయింది. అంతేకాకుండా ఈ సమయాన్ని క్యాష్‌ చేసుకునేందుకు ఓటీటీ సంస్థలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. విడుదలకు సిద్దంగా ఉండి లాక్‌ డౌన్‌ తో విడుదల కాకుండా ఆగిపోయిన చిత్రాలకు ఆకర్షణీయమైన ప్యాకేజీలు ఇవ్వడానికి ఓటీటీ సంస్థలు సిద్దమవుతున్నాయి.

 

ఇప్పుడు తాజాగా 8 సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి సిద్ధమయ్యాయి. తమిళంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘పొన్మగల్ వందాల్’ సినిమా మే 29న ఓటీటీలో రాబోతోందని అఫిసియల్ గా ప్రకటించారు. 'మహానటి' కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘పెంగ్విన్’ చిత్రాన్ని కూడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో జూన్ 19న‌ విడుద‌ల చేస్తున్న‌ట్టు అఫీషియ‌ల్‌ గా ప్ర‌క‌టించారు. అమితాబ్ బచ్చన్ - ఆయుష్మాన్ ఖురానా కలిసి నటించిన హిందీ చిత్రం 'గులాబో సితాబో' మరియు విద్యా బాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'శ‌కుంతల దేవి'.. అలాగే కన్నడ 'లా' మరియు 'ఫ్రెంచ్ బిర్యానీ' కూడా ఓటీటీలో రిలీజ్ అవబోతున్నాయి. మలయాళ 'సూపియుమ్ సుజాతయుమ్' సినిమా కూడా ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది.

 

ఈ నేపథ్యంలో 'ఉప్పెన' సినిమాని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ద్వారా మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు.. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన కృతీ శెట్టి హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఓటీటీలు ఈ సినిమాకి ఆఫర్ చేసిన ప్రైజ్ కి చిత్ర నిర్మాతలు సుముఖంగా లేరంట. దీనికి కారణం ఓటీటీలు మిగతా చిన్న సినిమాకి ఆఫర్ చేసే అమౌంట్ నే ఈ సినిమాకి ఆఫర్ చేశారట. దీంతో ఎంత లేట్ అయినా ఈ సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని 'ఉప్పెన' మేకర్స్ డిసైడ్ అయ్యారట.

మరింత సమాచారం తెలుసుకోండి: