గత కొద్ది రోజులుగా లాక్ డౌన్ కారణంతో అందరూ ఇళ్లకే పరిమితం అవడంతో కుటుంబ సభ్యులతో పూర్తి సమయాన్ని గడుపుతున్నారు. ఇక ఈ లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి భారతదేశంలోని ప్రతి రాష్ట్రం అధికారులు వారి వంతు కరోనాని అడ్డుకునేందుకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. అయితే ప్రజలు ఇంట్లో ఉండే వారు కాకుండా, రోడ్లపైకి వచ్చే వారు ఎవరి మాటలు వినకుండా ఇష్టానుసారం రోడ్లపై తిరుగుతున్నారు. 


దీనితో దేశంలో కరోనా నివారించడం చాలా కష్టం గా మారిపోయింది. అందుకే రెండు రోజుల క్రితం భారతదేశంలో లక్షకు పైగా కేసులు దాటిపోయాయి. ఇక మే 18న లాక్ డౌన్ 4.0 మొదలవగా ఇందులో చాలా ప్రాంతాలకు సడలింపులు ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి దీనితో మళ్లీ అందరూ రోడ్లపైకి రావడం మొదలు పెట్టారు. దీంతో మళ్లీ రోజురోజుకీ వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వెళుతుంది.


ఇక ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కొందరు ప్రజలకు అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే వారికి తగినంత చేయూతను కూడా ప్రజలకు అందిస్తూ వస్తున్నారు. అయితే ఇక తాజాగా కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నారు. అయితే ఈ రోజు సడన్ గా తన ఇంస్టాగ్రామ్ పోస్టు ద్వారా ముందుకు వచ్చారు. అయితే ఇందులో తన మొహానికి మాస్క్ తగిలించుకుని ఉన్న ఫోటోను షేర్ చేశాడు మహేష్ బాబు. లాక్ డౌన్ సడలింపుతో మనమంతా మెల్లగా బయటికి వస్తున్నాము కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి అంటూ మాస్ కు లేనిదే బయటకు రావద్దు అని మహేష్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. నేను ఇప్పుడు మాస్కు వేసుకున్నాను మీరు కూడా వాడాలని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: