టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ గేయ రచయితల్లో ashok TEJA' target='_blank' title='సుద్దాల అశోక్ తేజ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సుద్దాల అశోక్ తేజ ఒకరు. ఎన్నో భావయుక్త పాటలు ఆయన నుంచి వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో.. ‘నేను సైతం..’ అనే పాటకు జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. అయితే.. రెండు రోజులుగా సుద్దాల అశోక్ తేజ్ ఆరోగ్యం బాగోలేదని ఆయన హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని అనేక వార్తలు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఆయన మేనల్లుడు ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఈ విషయంపై స్పందించి ఓ వీడియో రిలీజ్ చేశారు.

 

 

‘సుద్దాల అశోక్ తేజ గారికి ఆరోగ్యం బాగోలేని విషయం నిజమే. అయితే ఆయనకు ఓ ఆపరేషన్ చేయాల్సి ఉందని డాక్టర్ పరిక్షల్లో తేలింది. దీంతో ఆయన ఈరోజు హాస్పిటల్ లో చేరనున్నారు. ఆపరేషన్ సమయంలో రక్తం అవసరమవుతుందేమో అని స్నేహితుడితో అంటే ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో రకరకాలుగా వార్త స్ప్రెడ్ అయింది. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రక్తం కోసం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి సహాయం కోరాము. తప్పకుండా సాయం అందిస్తామని తెలిపారు. అశోక్ గారి ఆరోగ్యంపై యోగక్షేమాలు అడిగిన వారందరికీ కృతజ్ఞతలు’ అని ఉత్తేజ్ ఓ వీడియో యూట్యూబ్ లో పోస్ట్ చేశారు.

 

 

అంతే కాకుండా.. సుద్దాల అశోక్ తేజ్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి సైతం తనకు ఫోన్ చేసి ఆరా తీసినట్టు తెలిపాడు ఉత్తేజ్. అవసరమైన సాయం అందిస్తామని చిరంజీవి చెప్పారని అన్నాడు. ఆయనతో మాట్లాడి చిరంజీవి చాలా ధైర్యం చెప్పారని అన్నాడు. ఈ ఫోన్ కాల్ తో అశోక్ సంతోషం వ్యక్తం చేసినట్టు కూడా ఉత్తేజ్ తెలిపాడు. ఉత్తేజ్ కు అశోక్ స్వయాన మేనమామ అవుతారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: