టాలీవుడ్ లో ఇప్పుడు హీరోలు ఎంత వరకు కూడా ప్రేక్షకులకు కొత్తదనం ఇచ్చే ప్రయత్నాలను ఎక్కువగా చేస్తున్నారు. తమ అభిమానులకు ఏది కావాలో తెలుసుకుని దానిని ఇవ్వడానికి గానూ తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే తాజాగా మహేష్ బాబు ఒక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. మహేష్ బాబు ఇప్పుడు పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత మ‌హేష్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. కొత్త క‌థ‌లు విని ఓకే చేస్తోన్న టైంలో వ‌చ్చిన క‌రోనా ఇప్పుడు మ‌హేష్ కెరీర్ ను అత‌లా కుత‌లం చేసింది.



ఇక ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ చేసే సినిమా  వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి తీసుకు రావడానికి గానూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు ముంబై వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఎందుకు వెళ్ళడం ఏంటీ కారణం అనేది స్పష్టంగా తెలియదు గాని మహేష్ బాబు మాత్రం ఈ సినిమాకు భారీగా బరువు పెరిగి గ్లామర్ లేకుండా కనపడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అతను చాలా మారిపోయాడు. ఇంట్లో ఉన్న వీడియోల్లో స‌రికొత్త‌గా ఉన్నాడు.



దీనిపై త్వరలోనే అతని నుంచి ఒక ఫోటో కూడా వస్తుంది అని సమాచారం. మహేష్ బాబు సినిమా అనగానే ప్రేక్షకులకు ఒక ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు దాన్ని మరింతగా పెంచడానికి గానూ మహేష్ బాబు ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి అభిమానులను అతను ఏ విధంగా అలరిస్తాడు అనేది చూడాలి. సాధారణంగా మహేష్ బాబు ఇప్పటి వరకు గ్లామర్ మాత్రమే ఉండే పాత్రలు చేశాడు గాని తన స్థాయి దిగి ఎప్పుడు కూడా రాలేదు. మ‌ధ్య‌లో కొన్ని సార్లు మాస్ యాంగిల్స్ లో ట్రై చేసినా అవి పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. మ‌హేష్ అభిమానులు సైతం అత‌డిలోని గ్లామ‌ర్ కోణాన్నే ఇష్ట‌ప‌డ‌తార‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: