ఇప్పుడు కరోనా కారణంగా టాలీవుడ్ ఎన్ని రకాల ఇబ్బందులు పడుతుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక్క సినిమా అయిన విడుదల అయితే చాలు అనుకునే విధంగా పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలోనే టాలీవుడ్ లో సినీ పెద్దలు అందరూ కూడా సినిమాలను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే కొన్ని సినిమాలను విడుదల చెయ్యాలని భావిస్తున్నారు. మ‌రో వైపు క‌రోనా కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది .. టాలీవుడ్‌కు చెందిన సినిమా ప‌రిశ్ర‌మ పెద్ద‌లు అంద‌రూ ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో స‌మావేశం కూడా అయ్యారు. వీరంతా క‌లిసి కేసీఆర్‌ను క‌ల‌వ‌గా కేసీఆర్ సైతం టాలీవుడ్ ప‌ట్ల సుముఖంగా వ్య‌వ‌హ‌రించారు.



తిరిగి షూటింగ్‌లు ప్రారంభించేందుకు ఆయ‌న అనుమ‌తులు ఇచ్చారు. ఇక తిరిగి షూటింగ్‌లు.. రిలీజ్‌ల హ‌డావిడితో టాలీవుడ్ హోరెత్త‌నుంది. ఈ క్ర‌మంలోనే ముందుగా చిన్న సినిమాలను విడుదల చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. ముందు చిన్న సినిమాలను విడుదల చేసి వాటికి ప్రేక్షకులు వచ్చారు అనుకుంటే అప్పుడు పెద్ద సినిమాలను విడుదల చెయ్యాలని భావిస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు జనాలు బయటకు రావడానికి చాలా వరకు భయపడే పరిస్థితి ఉందని తెలుస్తుంది. అందుకే హీరోలు ఇప్పుడు సినిమాలను విడుదల చేసే విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు.



చిన్న హీరోల సినిమాలు ఇప్పుడు విడుదలకు సిద్దంగా ఉన్నాయి కాబట్టి ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి అనే దాని మీద వారు సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఒక రెండు  సినిమాలను జాగ్రత్తలు తీసుకుని విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఏ సినిమాలను విడుదల చేస్తారు అనేది తెలియదు. రామ్ రెడ్ సినిమా తో పాటుగా మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ తేజ్ కి చెందిన ఉప్పెన సినిమాను విడుదల చేస్తారని వార్త‌లు వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: