దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగులు లేకపోవడంతో సెలబ్రెటీలు ఇంట్లోనే కాలం గడుపుతున్నారు.  సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఖాళీ సమయాన్ని తమ కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నాడు. ఇంట్లో తన కుమారుడు, కూతురితో ఆడుకుంటూ వీడియోలు తీసుకుంటున్నాడు. మహేష్ అభిమానుల కోసం సరదా సరదా వీడియోలు తీస్తూ... సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. డైలీ తన ఇంట్లో జరుగుతున్న చిన్న చిన్న ఫన్నీ విషయాల్ని మహేష్ సతీమణి నర్మతా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. తాజాగా మహేష్‌తో ఓ గేమ్ ఆడిన నమ్రత... ఈ గేమ్‌ లో తనను గెలవలేకపోతున్నానని పోస్టు చేశారు. వాస్తవానికి ఆ గేమ్‌ లో తాను ఎక్స్ ఫర్ట్ అని కానీ.. ఈ అబ్బాయిని మాత్రం ఓడించలేకపోతున్నానని నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు చేశారు.

 

 

ఇంతకీ వీరిద్దరూ ఆడిన ఆట ఏమనుకుంటున్నారా ? అదే బ్లింక్ అండ్ యు లూజ్ కాంపిటేషన్ గేమ్. కనురెప్ప వేయకుండా ఎదుట వ్యక్తిని చూస్తూ ఉండలి. కనురెప్పలు వేయకూడదు. ఎవరు ముందుగా కళ్లార్పితే వాళ్లు ఓడినట్లే. అయితే ఈ బ్లింక్ అండ్ యు లూజ్ గేమ్ ఆడిన నమ్రత.. మహేష్ వైపు కొన్ని సెకన్ల పాటు చుస్తూ.. ఒక్కసారిగా నవ్వేసింది. దీంతో మహేష్ కూడా నవ్వుతూ.. ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్ చేసింది. అంతకు ముందు మహేష్ కుమారుడు గౌతమ్ కు సంబంధించిన మరో వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో మహేశ్ బాబు తన కుమారుడు గౌతమ్‌ తో కూడా ఇదే గేమ్ ఆడుతూ కనిపిస్తారు. అయితే ఘట్టమనేని గౌతం ఈ గేమ్ ఆడేటప్పుడు నవ్వు ఆపుకోలేకపోయాడు. కళ్ల రెప్పలు కొట్టకుండా ఉండలేకపోయాడు అని నమ్రత పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: