బుల్లితెర ఫేమస్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ అనే సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకి సినిమాలలో చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించాడు. అయితే బుల్లితెరమీద పలు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రాంస్ తో అసాధారమైన క్రేజ్ ని సంపాదించుకున్న ప్రదీప్ నిర్మాతగాను మారి షోస్ తో సినిమా తారలతో మంచి ర్యాపో పెంచుకున్నాడు.

 

ఆ రకంగా వచ్చిన ఆలోచనా లేక నిజంగా ప్రదీప్ ని వెతుక్కుంటూ అవకాశామా తెలీది గాని మంచి కాన్సెప్ట్ తో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బుల్లితెర మీద ఎంతో స్టైలిష్ గా కనిపించిన ప్రదీప్ ఈ సినిమాలో మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాడు. మాస్ గెటప్ లో ప్రేక్షకులను ఇప్పటికే ఆకట్టుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకన్నా’ పాటకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈ సాంగ్‌ను రిలీజ్ చేయడం కూడా బాగా కలిసొచ్చిందని చెప్పాలి. 

 

అంతేకాదు టాలీవుడ్ లో ఉన్న రెండు టాప్ నిర్మాణ సంస్థలు సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చాయి. అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్, ప్రభాస్‌కు చెందిన యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నాయి. ఇక మున్నా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించగా... అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

 

ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ కన్నడ నిర్మాత ఎస్వీ బాబు సినిమాను నిర్మించారు. అయితే ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న ప్రదీప్ ఈ సినిమాతో హీరోగా సెటిలయితే బుల్లితెరమీద కనిపిస్తాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ హీరోగా సక్సస్ అయి వరసగా సినిమాలు చేస్తే మాత్రం బుల్లితెరకి ...ముఖ్యంగా ప్రదీప్ షోస్ చేస్తున్న రెండు ప్రముఖ ఛానళ్ళకి  పెద్ద దెబ్బే పడనుందని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: