టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి రెండేళ్ల క్రితం వచ్చిన భాగమతి తరువాత పూర్తి స్థాయిలో మరొక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదు. భాగమతి తరువాత గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాలో కొన్ని క్షణాల పాటు కనిపించే ఝాన్సీ లక్ష్మి భాయి పాత్రలో ఆమె నటించడం జరిగింది. ఇక దాని తరువాత ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమా నిశ్శబ్దం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ల పై సంయుక్తంగా నిర్మితం అవుతున్న ఈ సినిమాని హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. 

 

మంచి సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా పలు ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు నిన్నే నిన్నే సాంగ్ కూడా యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రాబట్టడం జరిగింది. వాస్తవానికి ఈపాటికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావలసి ఉండగా, కరోనా ఎఫెక్ట్ వలన చాలా రోజులుగా సినిమా విడుదలలు, షూటింగ్ లు బంద్ కావడంతో ఈ సినిమా కూడా ఆగిపోయింది. 

 

ఇక ఇటీవల కొన్నాళ్లుగా నిశ్శబ్దం సహా మరికొన్ని సినిమాలు కరోనా కారణంగా థియేటర్స్ లో విడుదల కాబోవడం లేదని, అందువల్లనే వాటిని ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ చేయాలని ఆయా సినిమాల దర్శక నిర్మాతలు నిర్ణయించినట్లు వార్తలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. కాగా వాటిపై నేడు సినిమా నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, గత కొద్దిరోజలుగా మా సినిమా థియేటర్స్ లో కాకుండా ఓటిటి లో రిలీజ్ అవుతున్న వార్తల్లో వాస్తవం లేదని, అయితే ఇదే పరిస్థితులు ఇంకొద్దిరోజులపాటు కొనసాగితే అప్పుడు సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయాలా లేక, ఓటిటి ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలా అనే దానిపై అందరం చర్చించి నిర్ణయిస్తాం అంటూ ఆయన తన ట్వీట్ లో తెలిపారు. అనుష్క తో పాటు షాలిని పాండే, మాధవన్ నటిస్తున్న ఈ సినిమాలో అంజలీ ఒక పోలీస్ ఆఫిసర్ పాత్రలో నటిస్తోంది.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: