దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ చిత్రం మెరిసిన అందాల ముద్దుగుమ్మ దిశా పటానీ గుర్తుండే ఉంటుంది. మోడలింగ్ చేస్తూ ఇండస్ట్రీవైపు వచ్చిన దిశా పటానీ గ్లామర్కు మంచి మార్కులే పడ్డాయి. కాకపోతే ఈ అమ్మడు నటించిన లోఫర్ తెలుగు లో డిజాస్టర్గా నిలిచిపోయింది. కానీ దిశాకు బాలీవుడ్లో అవకాశాలకు ఏమాత్రం కొదువలేదు. బాలీవుడ్ నటి దిశా పటానీ బాఘీ-3 చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. డు యు లవ్ మీ అంటూ సాగే ఈ పాటను ప్రేక్షకుల తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దిశా తన అందచందాలతో హాట్హాట్ స్టెప్పులేస్తూ చేసిన డ్యాన్స్..థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయిస్తోంది.
ఈ మద్య బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం ఐటమ్ సాంగ్స్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దిశా పటానీ తెరపైనే కాదు సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా ఉంటుంది. బికినీ ఫోటోలు, జిమ్ లో వ్యాయామాలు ఇలా ఎన్నో రకాలుగా సోషల్ మాద్యమాల్లోపోస్ట్ చేస్తుంది. మార్చి 6న వచ్చిన బాఘీ-3 తొలి వారాంతంలో రూ.53.83 కోట్టు వసూలు చేసినట్లు టాక్.
తాజాగా దిషా పటానీ.. సమ్మర్ హీటెక్కించింది. ఓ పాత ఫోటోను తాజాగా తన ఇన్స్టా అకౌంట్లో పోస్టు చేసింది. తన బీచ్ ట్రిప్కు సంబంధించిన ఫోటోను రిలీజ్ చేసింది. పూలపూల స్విమ్ డ్రెస్సులో దిషా హాట్గా కనిపిస్తోంది. సన్గ్లాసెస్ ధరించిన ఆ స్టార్.. సముద్ర అలల సమీపంలో నేలవాలినట్లు ఓ ఫోజు ఇచ్చింది. ఈ ఫోటోకు ఆమె ఫ్యాన్స్ లైక్లతో రెచ్చిపోతున్నారు.