హీరోయిన్ గా పాపులారిటీ తెచ్చుకుని ఆ తర్వాత నిర్మాతగా మారిన ఛార్మి క్రేజీ డైరక్టర్ పూరితో కలిసి వరుస సినిమాలు చేస్తుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ఛార్మి, పూరి కలిసి ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. అయితే సినిమా షూటింగ్ లో అనన్య పాండే టాలెంట్ చూసి ఆశ్చర్యపోయింది ఛార్మి. తప్పకుండా ఇండియా ఫైన్ యాక్ట్రెస్ లలో టాప్ 3లో అనన్య ఉంటుందని చెబుతుంది ఛార్మి. 

 

ఇక విజయ్ దేవరకొండ సెట్ లో ఉంటే ఎలాంటి టెన్షన్ ఉండదు.. అసలు ఎలాంటి కంప్లైంట్స్ కూడా రావని అంటుంది ఛార్మి. ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ అందుకున్న పూరి, ఛార్మి మళ్ళీ విజయ్ సినిమాతో ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ ప్రధాన అంశంగా వస్తున్న ఈ సినిమాకు టైటిల్ ఆల్రెడీ నిర్ణయించారట అయితే దాన్ని త్వరలో వెళ్లడిస్తామని అంటున్నారు ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన ఛార్మి. 

 

లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చామని.. షూటింగ్ కోసం చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నామని అంటుంది ఛార్మి. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. విజయ్ దేవరకొండ, అనన్య పాండే  తప్పకుండా అలరిస్తుందని సినిమాతో విజయ్ పాన్ ఇండియా హీరో  అవుతాడని చిత్రయూనిట్ చెబుతున్నారు. మరి విజయ్, పూరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ ట్రాక్ ఎక్కిన పూరి విజయ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ సినిమాను హిందీలో కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: