పెద్దల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటైన జంట కొన్ని విభేదాల కారణంగా విడిపోతున్న విషయం తెలిసిందే. ఇది సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు జరగుతున్న తంతే.  తాజాగా బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు నవాజుద్దీన్ సిద్ధఖీ.  చిన్న చిన్న పాత్రల్లో నటించి హీరో స్థాయికి ఎదిగాడు నవాజుద్దీన్ సిద్ధఖీ. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే.. పెళ్లిళ్లు, విడాకులు సాధారణ విషయాలుగా మారిపోయాయి. వైవాహిక సంబంధాలకు విలువే లేనట్టుగా... విడాకులకు సిద్ధమైపోతున్నారు. అభిప్రాయాలు కలవడం లేదని చాలా సింపుల్ గా చెప్పేస్తూ విడిపోతున్నారు. ఈ నేపథ్యంలో నటుడు నవాజుద్దీన్ సిద్ధఖీ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.  ఇప్పటికే తొలి భార్య నుంచి విడాకులు తీసుకున్న సిద్ధిఖీ... 2009లో అలియాను రెండో వివాహం చేసుకున్నాడు. 


వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గత కొంత కాలంగా ఈ జంట మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, నవాజ్ నుంచి విడాకులు కోరుతూ ఈ నెల 7న అలియా విడాకుల నోటీసులు పంపారు. అయితే ఆమెకున్న అఫైర్స్ కారణంగానే విడాకులు కోరిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం పట్ల ఆమె ఘాటుగా స్పందించారు.  తనకు ఎవరితోనూ ఎలాంటి ఎఫైర్స్ లేవని.. కావాలనే తనపై లేని పోని పుకార్లు పుట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వాస్తవాలను వెల్లడించేందుకే తాను సోషల్ ఖాతాను తెరిచానని వెల్లడించారు. 


గత కొంత కాలంగా సిద్దీఖీ నన్నూ నా పిల్లల్ని పట్టించుకోవడ లేదని.. నాన్న ఎక్కడని తమ ఇద్దరు పిల్లలు అడిగినప్పుడు ఆయనకు ఫోన్ చేసేదాన్నని... షూటింగ్ లో ఉన్నానని, వేరే వారితో మాట్లాడే పని ఉందని చెప్పేవాడని తెలిపారు. ఇంటికి వచ్చేవాడు కాదని అన్నారు. ఆ మద్య నటుడు మనోజ్ బాజ్ పాయ్ ముందు తనను ఘోరంగా అవమానించాడని కన్నీరు పెట్టుకుంది. కొన్నేళ్లుగా తాను క్షోభను అనుభవిస్తున్నానని... ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయేలా చేశాడని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: