బుల్లితెరపై నాగిని సీరియల్ తో ఎంతో పాపులారిటీ సంపాదించింది  మౌనీరాయ్.  ఆ తర్వాత వెండితెరపై తన వొంపుసొంపులతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది.  నాగిని సీరియల్ లో సిన్సియర్ గా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో మంచి నటిగా రాణించాలని ప్రయత్నిస్తుంది.  ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైన్ మోడలింగ్ చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంటుంది.  తాజాగా ఈ అమ్మడికి కరోనా కష్టాలు వచ్చాయి.  ప్రపంచంలో ఇప్పుడు  మౌనీరాయ్ కే కాదు అందరికీ ఇబ్బందులు ఉన్నా.. తాజాగా అమ్మడు నేను భారత్ కి ఎప్పుడొస్తానో అంటూ తెగ బాధపడిపోతుంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలుగా దుబాయ్‌లోనే ఉంటోంది బాలీవుడ్ నటి మౌనీరాయ్. కరోనా కేసులు నమోదుకు ముందు.. ఓ మ్యాగజైన్‌ ఫొటో షూట్‌ కోసం మార్చి నెలలో ఆమె యూఏఈకి  వెళ్లింది.

 

నాలుగు రోజుల వర్కింగ్‌ ట్రిప్‌ కాస్తా రెండు నెలల పెయినింగ్‌ ట్రిప్‌గా మారింది. ప్రస్తుతం ఓ పాత ఫ్రెండ్‌తో కలిసి ఉంటోంది  మౌనీ. పశ్చిమ బెంగాల్‌లోని కుటుంబాన్ని తలుచుకుంటూ నిత్యం బాధపడుతోంది. మౌనీ రాయ్‌ మాట్లాడుతూ.. ‘‘ ఫొటో షూట్‌ అయిపోయిన తర్వాత ఓ రెండు వారాలు దుబాయ్‌లో గడుపుదామని అనుకున్నాను. దానికి తోడు ఏప్రిల్‌ 15 వరకు నా చేతుల్లో ఏ ప్రాజెక్టు పనికూడా లేదు. ఛ నేను చేసిన కాస్త నిర్లక్ష్యానికి ఎంతో విలువ చెల్లించుకోవాల్సి వస్తుందని బాధపడుతుంది.

 

 కానీ, ప్రపంచం మొత్తం ఇలా మూతపడుతుందని అనుకోలేదు. నాలుగు జతల బట్టలతో ఉంటున్నాను.  నా సోదరుడు మా అమ్మదగ్గర ఉండి చూసుకుంటున్నాడు. మా బంధువులు కూడా మా ఇంటి పక్కనే ఉండటం మంచిదైంది. ఇండియాకు ఎప్పుడు తిరిగి వెళతానోనని ఎదురు చూస్తున్నా అని ఆవేదనవ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: