టాలీవుడ్ లో మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ కి వచ్చిన గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అనగానే కొందరు ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో ఆశగా సినిమా చూడటానికి రెడీ అవుతున్నారు. మ‌హాన‌టి సినిమాలో నిజ‌మైన సావిత్రిగా ఆమె న‌ట‌న న‌భూతోః న భ‌విష్య‌త్ అనేంత‌గా మెప్పించింది. ఈ తరుణంలో ఇప్పుడు ఆమెతో బయోపిక్ లను ఎక్కువగా ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా. తెలుగులో ఆమెను పెట్టి ఒక బయోపిక్ కి రంగం సిద్దమైంది అనే వార్తలు వచ్చాయి.

 

విజయ నిర్మల బయోపిక్ ని తీసే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అన్నారు. దీనిపై ముందు నరేష్ వార్తలను కొట్టిపారేసినా ఇప్పుడు తన తల్లి బయోపిక్ ని సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ఆలోచనలో ఆయన ఉన్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కీర్తి సురేష్ తో ఇప్పటికే నరేష్ చర్చలు కూడా మొదలుపెట్టారని... ఆ సినిమా రావడం ఖాయమని అంటున్నారు. ఇక ఈ తరుణంలోనే ఆమె నుంచి నరేష్ కి కొన్ని డిమాండ్ లు వచ్చాయని అంటున్నారు. 

 

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో విజ‌య నిర్మ‌ల పాత్ర‌లో న‌టించాలంటే అది ఒక్క కీర్తి సురేష్ వ‌ల్లే అవుతుంద‌ని కూడా ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు. ఆమె మినహా ఈ బయోపిక్ కి ఎవరూ సరిపోయే అవకాశం లేదని భావిస్తున్న నరేష్ ఆమె డిమాండ్ కి ఓకే చేసినట్టు సమాచారం. ఆమె సినిమా లో న‌టించినందుకు రెమ్యున‌రేష‌న్ కు బ‌దులుగా... సినిమా లాభాల్లో వాటా కావాల‌న్న కండీష‌ణ్ పెట్టిన‌ట్టు  సమాచారం. దీనికి నరేష్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాలి అని భావిస్తున్న అరెష్ మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పారంటున్నారు. అయితే ఇది ఎంత వ‌ర‌కు జ‌రుగుతుంది అన్న‌ది మాత్రం డౌటే..?

మరింత సమాచారం తెలుసుకోండి: