అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ లో సందీప్ రెడ్డి వంగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. విజయ్ దేవరకొండ తో తెరకెక్కించిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించింది. అంతేకాకుండా ట్రెండ్ సెట్టర్ సినిమాగా అనేకమంది స్టార్ డైరెక్టర్ ల ప్రశంశలను అందుకుంది. ఈ సినిమా విజయంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి కి టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్, డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మహేష్ బాబు మరియు రామ్ చరణ్ వంటి హీరోలు అప్పట్లో  ఓపెన్ గానే సందీప్ రెడ్డి వంగా తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటనలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ సందీప్ రెడ్డి వంగా మాత్రం అర్జున్ రెడ్డి సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా చేశారు.

 

ఇదే సినిమాని ‘కబీర్ సింగ్’ గా రీమేక్ చేసి షాహిద్ కపూర్ కి అదిరిపోయే విజయాన్ని అందించాడు. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బడాబడా హీరోలంతా సందీప్ రెడ్డి తో సినిమా చేయడానికి పోటీ పడ్డారు. ఇటువంటి సమయంలో రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి సినిమా చేయనున్నట్లు మొన్నటిదాకా ప్రచారం జరిగింది. కానీ అది పట్టాలెక్కలేదు. దానితో మళ్ళీ సౌత్ కె వచ్చిన సందీప్ నెక్స్ట్ సినిమాపై ఇంకా స్పష్టత లేదు. స్టార్ హీరోలకు తాను రాసిన కథలు అన్ని వినిపించిన సందీప్ రెడ్డి కి ఎక్కడ ఛాన్స్ దొరకలేదు.

 

ఇటువంటి సమయంలో సందీప్ రెడ్డి దగ్గరకే అదిరిపోయే అవకాశం వచ్చినట్లు ఫిలింనగర్ లో తాజాగా వార్తలు వినపడుతున్నాయి. అదేమిటంటే ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వారు సందీప్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ తమ దగ్గరే కథ ఉందని, అది మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' అని సినిమా రీమేక్ చేయాలని కోరారట. ఉన్నది ఉన్నట్లుగా డిట్టో దింపేస్తే చాలు అని సందీప్ రెడ్డి వంగా కి ఆఫర్ ఇచ్చారట. అంతా ఓకే అయితే అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారట. మరి సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా ఆఫర్ దక్కించుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: