టాలీవుడ్ లో తిరుగులేని గుర్తింపు సంపాదించింది మెగా కుటుంబం. మెగా ఫ్యామిలి నుండి దాదాపు డజను మంది  తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైయ్యారు. అయితే మెగా ఫ్యామిలి నుండి వచ్చిన వారిలో అందరికి డ్యాన్స్ పై మంచి పట్టు ఉంటుంది. మెగా స్టార్ చిరంజీవి తన డ్యాన్స్ తోనే అశేష అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన వారసులుగా తెలుగు తెరకు పరిచయమైన రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా డ్యాన్స్ లో తమదైన ముద్ర వేసారు. అయితే వీరి తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన సాయి ధరం తేజ్ కూడా వీరి బాటలోనే నడుస్తున్నాడు. 

 

సాయి ధరం తేజ్… ఈ హీరో మెగా ఫ్యామిలి నుండి వచ్చినా తన నటన, డ్యాన్స్ తో తనకంటూ ప్రత్యకమైన గుర్తింపు సంపాదించాడు. మెగా ఫ్యామిలి నుండి వస్తున్నాడు అంటే అభిమానుల్లో అతని పై భారీ అంచనాలు ఉంటాయి. అయితే ఆ నమ్మకాన్ని నిజం చేశాడు తేజు. తన డ్యాన్స్ తో మెగా అభిమానుల అభిమానాన్ని సంపాదించాడు. జవాన్ సినిమాకు గాను తేజు ఒక పాటలో ఒక నిమిషం పాటు నాన్ స్టాప్ గా డ్యాన్స్ చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు. అది కూడా సింగల్ టేక్ లోనే పర్ఫెక్ట్ గా చేసి సెట్ లో ఉన్న వాళ్ళందరితో వావ్ సుపర్బ్ అనిపించాడు. 

 

డ్యాన్స్ లో చిరంజీవి తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ శబాష్ అనిపించుకున్నారు. ఇక వీరి తర్వాత ఆ స్థానం సాయి ధరం తేజ్ దే అనేది అభిమానుల మాట. అందుకే డ్యాన్సుల్లో మరింత కష్టపడుతున్నాడు తేజు. ప్రస్తుతం తేజు ప్రతి రోజు పండగే సినిమా భారీ విజయాన్ని ఆస్వాదిస్తూ లాక్ డౌన్ వేళ తన కొత్త సినిమాను ఓటిటి ప్లాట్ ఫాం పై విడుదల చేయటానికి రెడీ అయినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: