మహేష్ బాబు సినిమాలు అనగానే ముందు మార్కెట్ గురించే టాలీవుడ్ వర్గాలు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాయి. సినిమా విడుదల కాక ముందు జరిగే మార్కెట్ నుంచి సినిమా విడుదల తర్వాత జరిగే మార్కెట్ వరకు అన్నీ కూడా హైలెట్ గా నిలుస్తూ ఉంటాయి. ఇటీవ‌ల కాలంలో మ‌హేష్ సినిమాల మార్కెట్ టోట‌ల్ గా రు. 150 కోట్ల వ‌ర‌కు జ‌రుగుతోంది. ఇందులో థియేట్రిక‌ల్ రైట్స్‌.. నాన్ థియేట్రిక‌ల్ రైట్స‌, డ‌బ్బింగ్ రైట్స్ రూపంలో నిర్మాత‌ల‌కు భారీగా డ‌బ్బులు వ‌స్తున్నాయి. 

 

ఈ క్ర‌మంలోనే మ‌హేష్ నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ అంతా తాను రెమ్యున‌రేష‌న్‌గా అడుగుతున్నాడ‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. సినిమా చేస్తే నిర్మాతకు కాసుల పంట అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదే మహేష్ బాబు కి కూడా వరంగా మారింది. దీనితో ఇప్పుడు మహేష్ సినిమాల మార్కెట్ బాధ్యతలను మొత్తాన్ని ఆయన భార్య నమ్రత దగ్గర ఉండి చూస్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ తరుణంలోనే నిర్మాతలతో మహేష్ బాబుకి విభేదాలు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇటీవల పరుశురాం సినిమా విషయంలో ఒక నిర్మాత ముందుకు రాగా ఆమె మరీ దారుణంగా సినిమా నైజాం హక్కులను అడిగారని.. వాటిని తమకు వదిలెయ్యాలని డిమాండ్ చేసారట. 

 

దీనితో షాక్ అయిన నిర్మాత అంత అవసరం లేదని తాను సినిమా చేయడం లేదని వెళ్లిపోయారట. ఇక మరి కొందరు నిర్మాతలు కూడా ఇప్పుడు ఇదే విధంగా నమ్రత విషయంలో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. టాలీవుడ్ లో ఇప్పుడు మహేష్ కమర్షియల్ గా అందరి కంటే ముందు వరుసలో ఉన్నాడు కాబట్టే ఆమె ఈ విధంగా డిమాండ్ చేసారని అంటున్నారు. గతంలో ఆయన మహేష్ తో సినిమా చేసి నష్టపోయారని అందుకే ఇప్పుడు సినిమా చేయ్యాలనుకున్నారట. ఏదేమైనా శ్రీమంతుడు సినిమా నుంచి మ‌హేష్ సినిమా వ్య‌వ‌హారాల్లో న‌మ్ర‌త జోక్యం పై ఇండ‌స్ట్రీలో ఎక్కువ పుకార్లు షికార్లు అయితే చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: