సూపర్ స్టార్ మహేష్… ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు. మహేష్ రాజకుమారుడు అనే చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమయ్యాడు. ఆ చిత్రం ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోయినా ఆ చిత్రంలో మహేష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. మహేష్ నటన పరంగా చాలా జాగ్రత్త గా ఉంటాడు. మహేష్ కృష్ణ నట వారసునిగా ఎంట్రీ ఇచ్చాడు. చిన్న వయసులోనే తండ్రి సినిమాల్లో నటించి, మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

మహేష్ జీవితంలో మైలు రాయిగా నిలిచిపోయిన చిత్రం పోకిరి. ఆ సినిమా తరువాత మహేష్ కెరీర్ టర్న్ అయ్యింది. మహేష్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే వంశి సినిమా లో తనతో కలిసి నటించిన నమ్రతా శిరోద్కర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నమ్రత సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు మహేష్, పిల్లల ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం కరోన కారణంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ లో మహేష్ తన కుటుంబంతో జాలీ గా గడుపుతున్నారు. ఈ నేపధ్యంలో మహేష్ డిన్నర్ సమయంలో తన ఫ్యామిలీ తో ఒక ఆట ఆడారు.  

 

ఆ ఆట ఏంటి అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం. ఎవరైతే ముందు కన్ను ఆర్పుతారో వారు ఓడిపోయినట్టు. ముందు గౌతం తో మొదలైన ఆటలో మహేష్ గెలిచారు. దాని తరువాత మహేష్ నమ్రత తో పోటి పడ్డారు. ఆట మొదలైన కొంత సమయానికే నమ్రత ఓటమి పాలైంది. మహేష్ పై ఓడిపోవడం గురించి నమ్రత స్పందిస్తూ.. మాములుగా నేను ఈ ఆట బాగా ఆడతాను, కాని ఎందుకో మహేష్ కళ్ళల్లోకి ఎక్కువ సేపు చూడలేక పోయాను. ఈ ఆట ఎవరితోనైనా ఆడి గెలవచ్చు కాని మహేష్ తో ఆడి గెలవలేం అని వెల్లడించింది. ఏది ఏమైనా మహేష్ లాక్ డౌన్ సమయాన్ని ఫ్యామిలి తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: