ఇప్పుడు టాలీవుడ్ లో పూజ హెగ్డే కి ఉన్న డిమాండ్ గురించి అందరికి తెలిసిందే. ఆమె చేసే సినిమాలు నటించే సినిమాలు అన్నీ కూడా స్టార్ హీరోలతోనే ఉంటున్నాయి. వచ్చే ఏడాది ఆమె మొత్తం కూడా ఫుల్ బిజీ గా ఉంటుంది అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ ఆఫర్లు వస్తున్నాయి తెలుగులో ఆమె సినిమాలు చేసే అవకాశం లేదనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఇక ఈ తరుణంలో ఒక వార్త బయటకు వచ్చింది. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే ఆమెకు టాలీవుడ్ నుంచి వార్నింగ్ వెళ్ళింది అని అంటున్నారు. 

 

అది ఏంటీ అంటే... ఆమె గనుక అక్కడ అయినా ఇక్కడ అయినా ఎక్కడ అయినా సరే ఒక చోటే సినిమాలు చెయ్యాలి అని అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి సినిమాలు చెయ్యాల్సిన అవసరం లేదని ఇక్కడ ఒక డేట్ ఇచ్చి అక్కడ ఒక డేట్ ఇచ్చి ఇక్కడి దర్శక నిర్మాతలను దయ చేసి ఇబ్బందులు పెట్టవద్దు అని ఆమెకు సూచనలు చేసినట్టు సమాచారం ఈ నేపధ్యంలోనే ఆమె బాలీవుడ్ ఆఫర్లు వచ్చినా సరే వద్దని చెప్పే అవకాశాలు ఉన్నాయని అక్కడి సినిమాల మీద ఆమెకు అంతగా నమ్మకం లేదని అంటున్నారు. ఆమెకు అక్కడి స్టార్ హీరోల సినిమాల్లోనే అవకాశాలు వస్తున్నాయి. 

 

అయినా సరే ఆమె ఇప్పుడు ఆలోచించుకునే ప్రయత్నం చేస్తుంది అని అంటున్నారు. ప్రస్తుతం ఆమెకు మన తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు లాక్ డౌన్ తర్వాత సినిమాలు మొదలు అయితే మాత్రం ఆమె కచ్చిత౦గా వరుసగా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి అనే  విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆమె రెండు సినిమాలు చేస్తుంది. ఒకటి ప్రభాస్ తో రెండు అఖిల్ తో చేస్తుంది. ఈ రెండు సినిమాలు ఆగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: