మన తెలుగులో భిన్నమైన కథలకు మంచి గుర్తింపు అనేది ఉంది. కథ బాగుంది అనుకుంటే చాలు ఇప్పుడు సినిమాలను చేయడానికి దర్శక నిర్మాతలు హీరోలు ముందుకు వస్తున్నారు. ఎవరికి వారుగా మంచి కథలను సిద్దం చేసుకుని సినిమాలను చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు హీరోయిన్ లు కూడా కథల మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. చిన్న చిన్న హీరోయిన్ లు కథలను రాసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రచయితలతో కలిసి వాళ్ళు ఇప్పుడు కథలను సిద్దం చేసుకుని సినిమాలను చెయ్యాలి అని భావిస్తున్నారు. 

 

అగ్ర హీరోయిన్ లు అయితే తామే నిర్మాతలుగా సినిమాలను చేయడానికి సిద్దంగా ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి. రష్మిక మంధన సహా పూజ వంటి వారు ఇప్పుడు మంచి కథల మీద ఫోకస్ చేసారు. ఈ తరుణంలో ఒక వార్త బయటకు వచ్చింది. రేణు దేశాయ్ కూడా ఇప్పుడు కథలు రాయడం మీద ఫోకస్ చేసింది అని సమాచారం. ఆమె ఒక కథను రెడీ చేసుకుని సినిమా చేయడానికి సిద్దంగా ఉందని ప్రచారం జరుగుతుంది. సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వస్తుంది అనేది ఇంకా స్పష్టంగా తెలియదు గాని ఆమె సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ నుంచి కూడా సహకారం ఉందని అంటున్నారు. 

 

ఇప్పుడు ఆమె సినిమా చేసే విషయంలో పవన్ కళ్యాణ్ కూడా ఆసక్తి చూపిస్తూ ఆమెకు ఆర్ధిక సహాయం కూడా చేస్తున్నారు అని అంటున్నారు. ఆమె ఈ సినిమాను వచ్చే ఏడాది సెట్స్ మీదకు తీసుకొచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి కథ ఏ విధంగా ఉంటుందో తెలియదు గాని తన కొడుకుని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా ఆన్నాయని సినీ పరిశీలకులు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: