టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన యువీ క్రియేషన్స్ పై రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మాటల దాడి  ఆగట్లేదు. ఇప్పటికే ఆ సంస్థ ను పలు సార్లు ట్రోల్ చేయగా తాజాగా మరోసారి ట్విట్టర్ లో తమ ప్రతాపం చూపిస్తున్నారు. దీనికి కారణం ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రం గురించి అప్డేట్ ఇవ్వకపోవడమే. సినిమా మొదలై చాలా రోజులు అవుతున్న ఇప్పటివరకు ఫస్ట్ లుక్ కాదుకదా కనీసం టైటిల్ ను కూడా విడుదలచేయలేదు. ఇదిగో వస్తుందంటూ మేకర్స్ ఫ్యాన్స్ ను కూల్ చేస్తున్నారు అంతే కానీ అప్డేట్ మాత్రం ఇవ్వడం లేదు దాంతో తాజాగా ప్రభాస్ అభిమానులు ప్రభాస్ 20 అనే యాష్ టాగ్ తో యువీ క్రియేషన్స్ ను ఓ ఆటాడుకుంటున్నారు. 
జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే జార్జియా లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకోగా తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగనుంది. ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో కృష్ణం రాజు ,భాను శ్రీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువీ క్రియేషన్స్ తో కలిసి గోపికృష్ణ మూవీస్ నిర్మిస్తున్న  ఈచిత్రం వచ్చే ఏడాది విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: