యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిస్తున్న రౌద్రం రణం రుథిరం సినిమాలో నటిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో తారక్ ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం. అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమరం భీం గా తారక్ నటిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమాని డి వి వి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 

ఇక ఈ సినిమా కంప్లీటవగానే త్రివిక్రం దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు తారక్. ఎన్.టి.ఆర్ 30 గా రూపొందబోయో ఈ సినిమాకి " అయినను పోయిరావలె హస్తినకు " అన్న టైటిల్ ఫిక్స్ చేయగా ఈ ఇయర్ లో సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. ఈ లోపు ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించిన తారక్ పార్ట్ షూటింగ్ అండ్ డబ్బింగ్ కంప్లీటవనుందట. ఒకసారి త్రివిక్రం తో సెట్ లోకి ఎంటరయ్యాక నాన్ స్టాప్ గా ఈ సినిమాని కంప్లీట్ చేసే విధంగా ప్లాన్స్ వేస్తున్నారట.

 

త్రివిక్రం తర్వాత తారక్ నటించబోయో సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కే.జీ.ఎఫ్ చాప్టర్ 2 కంప్లీట్ చేసి  తారక్ సినిమా కోసం రెడీ అవుతాడట. ఒకవేళ ఈ సినిమా గనక డిలే అయితే ఏమాత్రం సమయం తీసుకోకుండా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించే సినిమా ని సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు కూడా మరోవైపు సన్నాహాలు జరుగుతున్నాయట. మొత్తానికి తారక్ ప్లాన్ అదిరిపోయిందని అంటున్నారు. ఒక ప్రాజెక్ట్ లేటయినా మరో ప్రాజెక్ట్ ని ట్రాక్ ఎక్కించడానికి సిద్దంగా ఉన్నాడు ఈ యంగ్ టైగర్.

మరింత సమాచారం తెలుసుకోండి: