దేశంలో కరోనా తో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయంతో జీవితాలు గడుపుతున్నారు. అయితే మార్చి నుంచి లాక్ డౌన్ మొదలైన నేపథ్యంలో అన్ని శుభకార్యాలు ఆపివేశారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ బాధ తప్పలేదు. ఇక టాలీవుడ్ లో మొన్నటి వరకు బ్యాచ్ లర్ గా ఉన్న హీరోలు ఇప్పటికే ఎంగేజ్ మెంట్ జరుపుకొని పెళ్లికి సిద్దమయ్యారు.. కానీ కరోనా మహమ్మారి ప్రభావంతో పెళ్లిళ్లు కాస్త వాయిదా వేసుకున్నారు. ఈ జాబితాలో హీరోల నితిన్, నిఖిల్ ఇతర భాష హీరోలు ఉన్నారు. అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విషయంలో సడలింపులు ఇచ్చారు. అతి కొద్ది మంది ఐనవారి సమక్షంలో వివాహాది శుభకార్యాలు జరుపుకోవొచ్చని అది కూడా శానిటైజర్, మాస్క్ , భౌతిక ధూరం పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆంక్షలు విధించారు.
అంతే సినిమా పరిశ్రమలో ఇప్పుడు పెళ్లికళ మొదలైంది. ఇప్పటికే హీరో నిఖిల్ పెళ్లి చేసుకున్నారు.. కేవలం తన కుటుంబ సభ్యుల సమక్షంలో సాదా సీదాగా.. ఇక హీరో రానా అందరినీ ఆశ్చర్యపరుస్తూ తాను త్వరలో మిహికా బజాజ్ తో ఎంగేజ్మెంగ్ను కన్ఫామ్ చేశాడు. మనోడు కూడా త్వరలో ఓ ఇంటి వాడు అవుతున్నాడు. ఇప్పటికే హీరో నితిన్ లైన్లో ఉన్నాడు.. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఎవరు లైన్లోకి వస్తారు అన్న మాటలు ఫిలిమ్ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఇక తన పిల్లల గురించి సినీ నటుడు నాగబాబు చేసిన ప్రకటన కూడా వైరల్ అవుతోంది.
కొడుకు వరుణ్ తేజ్, కూతురు నిహారిక పెళ్లిళ్లను చేయాలనుకుంటున్నట్టు నాగబాబు తెలిపారు. ప్రస్తుతం సంబంధాలను వెతికే పనిలో ఉన్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో 33 ఏళ్లు దాటేస్తున్నాయని... పెళ్లి తప్పదు అంటూ కామెంట్ చేశాడు సాయి ధరమ్ తేజ్. మొత్తానికి ఈ ఏడాది టాలీవుడ్ లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి.