నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోస్ట్ పవర్ ఫుల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారని సమాచారం. బాలయ్య - బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'సింహ' 'లెజెండ్' సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై బాలయ్యతో పాటు ఆయన అభిమానులు కూడా నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కరోనా లాక్‌ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాను బోయపాటి శ్రీను రాయలసీమ, వారణాసి బ్యాక్‌ డ్రాప్‌ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం బాలయ్య ఏకంగా గుండు కూడా చేయించుకున్నాడు. ఈ సినిమాలో బాలయ్య మరోసారి రెండు పాత్రల్లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర కాగా రెండోది ఫాక్షనిస్ట్ పాత్ర అని వార్తలు వస్తున్నాయి. 

 

ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ఇప్పటికే అనేక రకాలుగా చాల రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే బాలయ్య ఈ సినిమాలో క‌వ‌ల‌లుగా నటించబోతున్నారని న్యూస్ వచ్చింది. అందులో ఒక క్యారెక్టర్ విలన్ అని.. హీరో క్యారెక్టర్ కి, విలన్ క్యారెక్టర్ కి మధ్య జరిగే సస్పెన్స్ డ్రామానే బోయపాటి తనదైన మాస్ స్టైల్ లో తెరకెకెక్కించబోతున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా సెకెండ్ హాఫ్ లో హీరో ఎవరు.. విలన్ ఎవరు అనే కోణంలో వచ్చే సస్పెన్స్ సీన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయట. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడని తెలుస్తోంది. కాగా గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ‘సింహా’ బ్లాక్ బస్టర్‌ అందించిన బోయపాటి శ్రీను ఇప్పుడు మళ్ళీ ప్లాపుల్లో ఉన్న బాలయ్యని గట్టెక్కిస్తాడని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. మరి ఈ చిత్రంతో బాలయ్య - బోయపాటి శ్రీను హాట్రిక్ హిట్ సాధించి బాలయ్య మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: