టాలీవుడ్ లో ఒక్కొక్కరూ పెళ్ళి పీటలెక్కుతున్న వేళ సాయిధరమ్ తేజ్ నో పెళ్ళి అంటున్నాడు. టాలీవుడ్ బ్యాచులర్స్ అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్న సమయంలో సాయి ధరమ్ తేజ్ పై కూడా పెళ్ళి వార్తలు ఒత్తిడి పెంచుతున్నాయి. నిన్నటికి నిన్న వరుణ్ తేజ్ పెళ్ళికి సంబంధించిన వార్తలు వచ్చినపుడు, ఏంటి బావా నీకు పెళ్ళటగా అని చెప్పి సోషల్ మీడియాలో మెసేజ్ చేసి అందరికీ ఆసక్తిని కలిగించిన సాయి ధరమ్ తేజ్ నో పెళ్ళి అనే పాటతో ముందుకు వస్తున్నాడు.

 

ప్రతీరోజూ పండగే సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ చేస్తున్న సోలో బ్రతుకే సో బెటరు అనే సినిమా నుండి ఈ పాట రిలీజ్ కానుంది. సినిమా టైటిల్ చూస్తేనే కాన్సెప్ట్ ఏంటనేది అర్థమైపోయింది. సింగిల్స్ ని టార్గెట్ గా చేస్తూ వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో పాటని రిలీజ్ చేయడానికి సిద్ధం అయిపోయారు.

 

ఎస్వీసీసీ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు. అలవైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. సో ఈ పాటపై అందరికీ ఎక్స్ పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇకపోతే ఈ పాటని మొన్నే నిశ్చితార్థం చేసుకున్న నితిన్ తో విడుదల చేయించనున్నారట. తను ప్రేమించిన షాలినితో పెళ్ళికి సిధ్ధమైన నితిన్, లాక్డౌన్ కారణంగా పెళ్ళి వాయిదా వేసుకున్నాడు.

 

ఇప్పుడూ నితిన్ తోనే నో పెళ్ళి అనే పాట రిలీజ్ చేయిస్తుండడం ఆసక్తికరం. రేపు ఉదయం ౧౦గంటలకి ఈ పాట రిలీజ్ కానుందట. అయితే ఈ పాట సింగిల్స్ గా ఉన్నవాళ్ళు మింగిల్ అయిన వాళ్లకి ఉపదేశం ఇస్తున్నట్టు ఉంటుందా.. లేదా ఆల్రెడీ మింగిల్ అయినవాళ్ళు సింగిల్స్ కి చెప్తున్నట్టు ఉంటుందా అనేది సస్పెన్స్ గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: