సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే కెరీర్ ఉంటుంది. వరుసగా సక్సెస్ లు ఇచ్చుకుంటూ వెళ్తేనే జనాలు గుర్తుపెట్టుకుంటారు. ఒక్కసారి ఫెయిల్యూర్ వచ్చిందా ఇక అంతే సంగతి. మార్కెట్ తగ్గడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలాంటి టైమ్ లోనే మళ్లీ హిట్ కొట్టి మార్కెట్ పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. వరుస విజయాలు సాధించడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఒక సినిమా ఫ్లాప్ అయినా మరో సినిమాతో హిట్ కొట్టడానికి ప్రయత్నిస్తుంటారు.

 

అయితే వరుసగా సినిమాలు ఫ్లాప్ అయినపుడు హీరోకి పెద్ద సమస్య ఏర్పడుతుంది. ప్రస్తుతం యంగ్ హీరో రాజ్ తరుణ్ పరిస్థితి అలాగే ఉంది. ఉయ్యాలా జంపాలా, కుమారి ౨౧ ఎఫ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న రాజ్ తరుణ్, గత కొన్ని రోజులుగా వరుసగా ఫ్లాపులు ఎదుర్కొంటున్నాడు. ప్రతిష్టాత్మక బ్యానర్ అయిన శ్రీ వెంకటేశ్వర్ నిర్మాణంలో దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో రాజ్ తరుణ్ మార్కెట్ బాగా పడిపోయింది.

 

దాంతో ఇప్పుడు ఖచ్చితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కిన ఒరేయ్ బుజ్జిగా విడుదలకి సిద్ధంగా ఉంది. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే ఈ పాటికే సినిమా రిలీజై రాజ్ తరుణ్ భవితవ్యం ఏంటనేది తెలిసి ఉండేది. మాళవికా నాయర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా మీద రాజ్ తరుణ్ బాగా ఆశలు పెట్టుకున్నాడు. అదీగాక ఈ విజయం రాజ్ తరుణ్ కి బాగ అవసరం కూడా.

 


అందువల్ల కొంచెం టెన్షన్ పడుతున్నాడట. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుండి మంచి ఆఫర్ వస్తే అక్కడ రిలీజ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా రిలీజ్ అయితే రాజ్ తరుణ్ కెరీర్ నష్టం జరగవచ్చేమో అనే అభిప్రాయాన్ని వెల్లడి చేస్తున్నారు. చూడాలి మరేం జరగనుందో..!

మరింత సమాచారం తెలుసుకోండి: