కుమారి 21f చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారని... దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు అని తెలిసి ఆ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. అంతగా ప్రేక్షకాదరణ లేని నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం రాజ్ తరుణ్ కి, హీరోయిన్ హెబ్బా పటేల్ కి ఎంతో పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టింది. 2015 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం బెస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్ గా పేరు సంపాదించింది. వాస్తవానికి 2015 వ సంవత్సరం వరకు వచ్చిన బోల్డ్ సినిమాలలో కుమారి 21ఎఫ్ ప్రథమ స్థానాన్ని సంపాదిస్తోంది అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. 


అన్ని రొటీన్ మసాలా సినిమాలకు డిఫరెంట్ గా తెరకెక్కిన కుమారి 21f విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ఈ సినిమాలో మెచ్యూరిటీ గురించి, నమ్మకం గురించి, కల్మషం లేని ప్రేమ గురించి సూపర్ గా తెలియజేశాడు సుకుమార్. కేవలం యువతని మాత్రమే ఆకట్టుకుంటుందని భావించినా ఈ సినిమా కథా సూపర్ గా ఉండడంతో... పెద్దల సైతం ఈ చిత్రాన్ని బాగా ఇష్టపడ్డారు. వంటమనిషి పాత్రలో నటించిన రాజ్ తరుణ్ నటనా ప్రతిభ అందరి ప్రేక్షకుల మనసులను దోచేసింది. హెబ్బా పటేల్ నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఈ సినిమాలో ముద్దు సన్నివేశాలు ప్రతి ఒక్కరికి కిక్కెక్కించేయంటే అతిశయోక్తి కాదు. 


వీరిద్దరి మధ్య కొనసాగే అన్ని సన్నివేశాలు చాలా కొత్తగా ఉండడంతోపాటు చాలా హాట్ గా ఉంటాయి. మీనా కుమారి పాత్ర దశాబ్దాల తెలుగు ప్రేక్షకులకు గుర్తుంచుకుంటారు. ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ సుకుమార్ కే దక్కుతుంది. మేఘాలు లేకున్నా పాటకు అద్భుతంగా సంగీతం సమకూర్చిన దేవి శ్రీ ప్రసాద్ అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాడు. మరింత బోల్డ్ కంటెంట్ తో ఈ సినిమా తెరకెక్కింది కానీ క్లైమాక్స్ లో ఓ సన్నివేశం మాత్రం అందరికీ కంటనీరు తెప్పించింది. ఏదేమైనా ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు.

మరింత సమాచారం తెలుసుకోండి: