చిరంజీవి సినిమాల్లో ఇప్పుడు అంటే పెద్దగా రోమాన్స్ లేదు గాని గతంలో ఆయన సినిమాల్లో ఎక్కువగా అది కనపడుతూ ఉండేది. ఎంత వరకు ఉండాలో అంత వరకు మాత్రమే ఆ సన్నివేశాలు ఉండేవి అప్పట్లో అనేది వాస్తవం. చిరంజీవి చాలా జాగ్రత్తగా ఆ సన్నివేశాల్లో నటించి మెప్పించే వారు. ప్రేక్షకులకు అయితే ఆయన రోమాన్స్ సీన్ లో ఉన్నారు అంటే పండగ లాంటి వాతావరణం ఉంటుంది. టాలీవుడ్ లో ఆయన సినిమాల్లో కొన్నింటి లో రోమాన్స్ కి కూడా ప్రాధాన్యత ఉండేది. యువ హీరోగా ఉన్న సమయంలో ఆయన రోమాన్స్ ఎక్కువగా చేస్తూ ఉండే వారు. 

 

ఇక ఆయన భాను ప్రియ, టబు అలాగే మాధవి వంటి హీరోయిన్ లతో చేసిన రోమాన్స్ అన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పుకోవచ్చు. చిరంజీవి ఆ విధంగా వాటిల్లో నటించి మెప్పించారు. జ్వాల సినిమాలో చిరంజీవి భాను ప్రియ మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను కాక పుట్టించాయి. భాను ప్రియచిరంజీవి పక్కన చాలా అందంగా నటించారు. చిరంజీవి సినిమాల్లో రోమాన్స్ ఏ స్థాయిలో ఉంటుందో కనపడకుండా చూపించి చూపించకుండా చేసారు అనేది వాస్తవం. ఇక అది పక్కన పెడితే ఆయన సినిమాల్లో బాగా పేరు తీసుకొచ్చిన కొన్ని సినిమాలు కూడా రోమాన్స్ కి అడ్డాగా నిలిచాయి అనేది వాస్తవం. 

 

ప్రస్తుతం చిరంజీవి ఆచార్యా అనే సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన మలయాళం సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ లో చిరంజీవి ఖాళీ గా ఉన్నారు. త్వరలోనే సినిమాల షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక రామ్ చరణ్ నిర్మాతగానే ఆయన ఎక్కువగా సినిమాలను చేస్తున్నారు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: