సంజయ్ గాంధీ ఇప్పటి తరంలో చాలా మంది కి తెలియదేమో గాని.. ఉక్కు మనిషి దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి రెండో కుమారుడు. రాజీవ్ గాంధీకి స్వయానా సోదరుడు. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీకి భర్త కాగా... మరో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి తండ్రి. రాజీవ్కు సొంత సోదరుడు అయినా సంజయ్ గాంధీ దూకుడైన మనస్తత్వానికి మారు పేరని అంటారు. ఇక సంజయ్ గాంధీకి విమానాన్ని పదే పదే పల్టీలు కొట్టించడం ఇష్టం. ఈ క్రమంలోనే సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో చనిపోయారు.
ఇదిలా ఉంటే సంజయ్ గాంధీకి బాలీవుడ్కు లింకులు ఉన్నాయన్న టాక్ అయితే అప్పట్లో ఉండేది. నిన్నటి తరం ఓ ప్రముఖ హీరోకు తల్లి.. ఓ బాలీవుడ్ క్రేజీ హీరోకు అత్తతో ఆయనకు ఎఫైర్ ఉందన్న పుకార్లు అయితే అప్పట్లో వినిపించేవి. ఇక ఆ సంగతేంటో చూద్దాం. సంజయ్ గాంధీకి దగ్గరగా ఉన్న వాళ్లు ఎమర్జెన్సీ సమయంలో బాగా లాభపడ్డారు. అలాంటి వారిలో ఒకరు సినీ నటి అమృతా సింగ్ తల్లి రుఖ్సానా సుల్తాన్ ఒకరట. ఆమె ఎవరో కాదు సీనియర్ బాలీవుడ్ నటి అమృతా సింగ్కు స్వయానా తల్లి కాగా.. సైప్ ఆలీఖాన్కు అత్తగారు.
సైఫ్ ఆలీఖాన్ వయస్సులో తనకన్నా పెద్దది అయిన అమృతా సింగ్నుప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లల తర్వాత విడాకులు ఇచ్చి మళ్లీ కరీనా కపూర్ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక రుక్సార్ అప్పట్లో సంజయ్ తో తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి ఏ మాత్రం దాపరికం లేకుండా చెప్పుకునేవారట. దేశాన్ని ఊపేసిన ఎమర్జెన్సీ సమయంలో రుఖ్సానా కూడా చాలానే అధికారం చెలాయించేవారు. అధికారాన్ని ఆమె ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకున్నారన్న టాక్ ఉంది.
ఆ టైంలోనే రుక్సార్ సంజయ్ పేరుతో జామా మసీదు సుందరీకరణ చేసుకున్నారన్న టాక్ ఉంది. అయితే అప్పట్లో ఆమె సంజయ్ పేరు చెప్పుకుని అధికారం ఎలా దుర్వినియోగం చేస్తుందన్న విషయం చెప్పేందుకు ఒక్కరు కూడా సాహసించే వారు కాదట.