ప్రస్తుతం అంతా సోషల్ మీడియా కాలం. ఇందులో వైరల్ కు కాదేదీ అనర్హం అన్నట్టు ఉంటుంది. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ హవాకు తోడు ఈమధ్య బాగా పాపులర్ అయిన మరో వేదిక టిక్ టాక్. ఇందులో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ తమకు ఇష్టమైన దానిని ఇమిటేట్ చేసి పోస్ట్ చేయొచ్చు. తమ టాలెంట్ చూపేందుకు టిక్ టిక్ సరైన వేదిక. ఇప్పుడు దీనిని ఉపయోగించుకునే తెలుగు బిగ్ బాస్1 కన్సెస్టెంట్ దీక్షా పంత్ ఓ టిక్ టాక్ వీడియో చేసింది.
ఏకంగా రంగస్థలంలో రామ్ చరణ్ – సమంత మధ్య నడిచే ఓ రొమాంటిక్ సీన్ ను టిక్ టాక్ చేసింది. ‘నువ్వంటే నాకిష్టం.. ఇలాగే సెప్తాను.. ఎలగెలాగ.. ఎయ్.. మెల్లిమెల్లిగా సౌండ్ లేకుండా సెప్పవే.. నువ్వంటే.. ఎధవ్వి.. నాకిష్టం.. సవటవి.. ఇలాగే సెప్తా.. నిన్నెవడు సేస్కుంటాడా’ అంటూ చరణ్ – సమంతల మధ్య డైలాగ్ వెర్షన్ ను వీడియో చేసింది. అచ్చం సమంతలానే లంగా ఓణీ వేసి మరీ దీక్షా పంత్ ఈ వీడియో చేసింది. ఆ డైలాగ్ కు ఒరిజినల్ ఫీల్ రావాలని తను చేసిన ప్రయత్నం బాగానే వర్కౌట్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.
దీక్షా క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి చరణ్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘సో క్యూట్’, ‘బాగా చేశావ్’ అంటూ రిప్లై ఇస్తున్నారు. గోపాల గోపాల, శంకరాభరణం, బంతిపూల జానకి.. వంటి సినిమాల్లో నటించింది దీక్షా. ప్రస్తుతం ఈమెకు సినిమా ఆఫర్స్ ఏమీ లేవు. ఈ వీడియో చూశాకైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి.