టాలీవుడ్ లో చిరంజీవి కి ఉన్న క్రేజ్ గురించి మనకు తెలిసిన విషయమే. అయితే చిరంజీవి ఆన్ స్క్రీన్ హీరో మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ హీరో కూడా. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన చిరంజీవి, తన తమ్ముళ్లను మిస్ అవుతున్నానని తెలిపారు. ఇటీవలే సోషల్ మీడియా లో అడుగుపెట్టిన చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానుల తో పంచుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే తన పోస్టులతో ప్రజలకు కరోన నుంచి సురక్షితంగా ఎలా ఉండాలో ఎప్పటి కప్పుడు సూచనలు ఇస్తున్నారు.

 

తాజాగా చిరంజీవి తన ఫ్యామిలీ కి సంబంధించిన ఒక ఫోటోను సోషల్ మీడియా లో పోస్ట్  చేసారు. ఈ ఫోటో బాగా వైరల్ అయ్యింది. తన తమ్ముళ్లను అలాగే సోదరీమణులను బాగా మిస్ అవుతున్నానని ఆయన సోషల్ మీడియా  ద్వారా తెలిపారు. లాక్ డౌన్ కు ముందు చిరంజీవి తన తల్లి అంజనాదేవి, తమ్ముళ్లు నాగ బాబు, పవన్ అలాగే చెల్లెళ్లు మాధవి, విజయ దుర్గలతో కలిసి ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోను చిరు పోస్ట్ చేసారు. లాక్ డౌన్ కు ముందు ఓ ఆదివారం ఇలా అంటూ… ప్రియమైన వారిని మిస్ అవుతున్నాను అన్నారు. 

 

ఇలాంటి భావన మీలో చాలా మందికి ఉండి  ఉంటదని, త్వరలోనే మన మామూలు జీవితం మనకు తిరిగి వస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ పోస్ట్ ద్వారా చిరు తన వారితో అప్పుడప్పుడు ఇలా గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకుంటామని అభిమానులకు తెలిపారు. ఈ పోస్ట్ ను చూసిన చరణ్ అభిమానులు మా దేవుడు రామ్ చరణ్ ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ పోస్ట్ ద్వారా చిరు తన ఫ్యామిలీ ని బాగా మిస్ అవుతున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: