‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘RRR’. మొట్టమొదటిసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కాగా ఈ సినిమా మొట్టమొదటిసారి ప్రారంభించిన సమయంలో ఈ ఏడాది జూన్ 30వ తారీఖున రిలీజ్ చేస్తారని డేట్ అనౌన్స్ చేసి మరీ షూటింగ్ స్టార్ట్ చేశారు. తీరా షూటింగ్ జరుగుతున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి గాయాలు అవటంతో సినిమా షూటింగ్ కొద్ది నెలలు ఆగిపోయింది. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కి హీరోయిన్ దొరకకపోవడంతో మరింత ఆలస్యం అయింది.

 

దీంతో జూన్ మాసం వచ్చేస్తున్న సందర్భంలో సినిమా యూనిట్, సినిమా రిలీజ్ చేయలేమని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ఎఫెక్ట్ కి లాక్ డౌన్ విధించడంతో దాదాపు 60 రోజుల పాటు షూటింగ్ ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. ఇక rrr సినిమా 2022 లో రిలీజ్ అవుతుందని రాజమౌళి ఉన్న కొద్దీ లేట్ చేస్తారని నందమూరి మెగా అభిమానులు భావించారు. ఇటువంటి సమయంలో తాజాగా ఈ సినిమా గురించి లేటెస్ట్ వార్త ఇండస్ట్రీలో వినబడుతోంది. అదేమిటంటే ఈ సినిమాకి సంబంధించి కేవలం షూటింగ్ ఇంకా 25 శాతం మాత్రమే మిగిలి ఉందట.  ఈ వార్త విని సినిమా ప్రేక్షకులు సినిమాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

మామూలుగా రాజమౌళి సినిమాలు చేయటానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటారు అని అందరికీ తెలుసు. కానీ అలాంటిది ఇంత భారీ చిత్రం పైగా ఇద్దరు టాప్ హీరోలు కలిగిన ఈ సినిమాకి ఇంత తక్కువ టైంలో దాదాపు 70% ఏజ్ షూటింగ్ రాజమౌళి కంప్లీట్ చేయడం అంటే ఎవరు నమ్మడం లేదు. అసలు సినిమా షూటింగ్ ఎప్పుడు జరిగింది ఎలా అయిందో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీన్ని బట్టి చూస్తే వచ్చే జనవరిలో ఈ సినిమా రిలీజ్ అవడం గ్యారెంటీ అనే టాక్ ఫిలింనగర్ లో బలం గా వినబడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: