కీర్తి సురేష్ .. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోను మంచి ఫాం లో ఉన్న హీరోయిన్. నేను శైలజ తో తెలుగు తెరకి పరిచయమైన కీర్తి ఆ తర్వాత నాని తో నేను లోకల్ పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి, మహానటి సినిమాలు చేసింది. మహానటి తో గొప్ప కీర్తిని దక్కించుకుంది కీర్తి. అయితే ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలకి దూరంగా ఉన్న కీర్తి కి సినిమాలు అంతగా రావని అనుకున్నారు. అయితే ఇలా గ్లామర్ పాత్రలు తెలుగులో చేయడం లేదు. కాని తమిళంలో మాత్రం కాస్త గ్లామరస్ గా కనిపించి ప్రేక్షకులను కనువిందు చేస్తుంది. 

 

ఇక కొన్నిటికి మాత్రం కీర్తి సురేష్ తెలుగు అయినా తమిళం అయినా నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది. అయితే ఇప్పటివరకు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ అంటే పూజా హెగ్డే, రష్మిక మందన్న అని అనుకుంటున్నారు. కాని కీర్తి సురేష్ వీళ్ళకంటే రేస్ లో ముందు ఉండి దూసుకుపోతున్న విషయం ఈ ముగ్గురు చేస్తున్న సినిమాల లిస్ట్ చూస్తే తెలుస్తుంది. పూజా హెగ్డే బాలీవుడ్ లో రెండు సినిమాలు, టాలీవుడ్ లో ప్రభాస్, అఖిల్ అక్కినేని సినిమాలు చేస్తుంది. అలాగే రష్మిక మందన్న అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తుంది. అలాగే కన్నడలో ఒక సినిమా, తమిళంలో ఒక సినిమా చేస్తుంది. 

 

అంటే అఫీషియల్ గా పూజా హెగ్డే చేతిలో 4 సినిమాలు, రష్మిక మందన్న చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. అదే కీర్తి సురేష్ పెంగ్విన్, నితిన్ రంగ్ దే, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ, సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నాత్తే సినిమాలతో పాటు ఒక మళయాళం సినిమా ఉంది. అంటే మొత్తం 6 సినిమాలు చేస్తుంది. ఇవి కాకుండా నితిన్ తో మరో సినిమా కూడా చేసే వకాశం ఉందని తెలుస్తుంది. ఈ రకంగా చూస్తే పూజా హెగ్డే, రష్మిక మందన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ అంటున్నారు గాని చూస్తే కీర్తి సిరేష్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అని అర్థమవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: