డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చాలా కాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో భారీ సక్సస్  ని అందుకున్నాడు. ఈ సినిమాతో తనకే కాదు ఫ్లాపుల్లో హీరో.. హీరోయిన్స్, మ్యూజిక్ డైరెక్టర్ ..ఇలా అందరికి హిట్ ఇచ్చి లైఫ్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేస్తున్నాడు. నాలుగు భాషల్లో ఈ సినిమాని పాన్ ఇండియా రెంజ్ లో నిర్మిస్తున్నారు. పూరి.. ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరన్ జోహార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 40 % టాకీ పార్ట్ కంప్లీట్ చేశారు. 

 

లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా ను తిరిగి త్వరలో ప్రారంభించబోతున్నారు. హైదరాబాద్ లోనే ఈ సినిమాని కంప్లీట్ చేయనున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే లాక్ డన్ తో దాదాపు రెండు నెలలు మంచి రిలాక్స్డ్ టైం దొరకడంతో ఒక స్టార్ హీరో కోసం పూరి కథ రాస్తున్నాడని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ కథనాలలో నిజముంది. పూరి నిజంగానే ఒక స్టార్ హీరో కోసం కథ సిద్దం చేశాడు. అయితే ఈ విషయం తెలిసినప్పటినుంచి ఫ్యాన్స్ ఎవరికి వాళ్ళు పూరి రాసే కథ మా హీరో కొసమే అంటే మా హీరో కోసమే అంటూ చర్చించుకున్నారు. పవన్ కళ్యాణ్ కోసమి, మెగాస్టార్ చిరంజీ కోసం అని, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుతో హ్యాట్రిక్ హిట్ కొట్టే కథ రాశాడని ..ఆల్రెడీ మహేష్ బాబు కథ కూడా విన్నాడని ..ఇలా రక రకాలుగా వార్తలు వచ్చాయి. 

 

అయితే ఇవన్ని క్రియోటివ్ న్యూస్ అని తాజా సమాచారం. విశ్వసనీయ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం పూరి రాసిన కథ నందమూరి బాలకృష్ణ కోసం అని తెలుస్తుంది. ఇపటికే కథ విషయంలో ఇద్దరి ఒక నిర్ణయానికి కూడా వచ్చారట. బాలయ్యకి కూడా పూరి కథ నచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం పూరి - విజయ్, అలాగే బాలయ్య - బోయపాటి సినిమా కంప్లీటయ్యాక పూరి - బాలయ్య సినిమా పట్టాలెక్కనుందని త్వరలో ఇందుకు సంబంధించి ఇద్దరి నుంచి అఫీషియల్ న్యూస్ రాబోతుందని తెలుస్తుంది. ఇంతకముందు పూరి బాలయ్య కాంబినేషన్ లో పైసా వసూల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా అనుకున్నంతగా సక్సస్ కాలేదు. దాంతో ఈసారి బాలయ్యకి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని డిసైడయ్యాడట పూరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: