ఇప్పుడు మన తెలుగులో చాలా వరకు ఇతర భాషల సినిమాల మీద దృష్టి పెట్టారు. అక్కడ హిట్ అయిన సినిమాలను ఇక్కడ తీసుకొచ్చి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు మన వాళ్ళు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోలు ఎక్కువుగా పరభాషా కథలపై కాన్ సంట్రేషన్ చేస్తున్నారు. చిరంజీవి పదేళ్ల గ్యాప్ తర్వాత చేసిన రీమేక్ మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమా. ఇక ఇప్పుడు మళయాళ హిట్ సినిమా లూసీఫర్ రీమేక్ లో కూడా చేస్తాడంటున్నారు. ఇక పవన్ కూడా ఇటీవల కాలంలో రీమేక్ కథల్లోనే ఎక్కువుగా నటించాడు. రామ్ చరణ్ సైతం ధృవ రీమేక్ లో చేశాడు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఇతర భాషల సినిమాల మీద ఫోకస్ చేయడం అలా ఉంటే... ఇక మరో స్టార్ హీరో కూడా ఇతర భాషల సినిమాల మీద ఫోకస్ పెట్టాడు అని అతను కూడా మెగా ఫ్యామిలీ హీరోనే అని అంటున్నారు. ఆ హీరోనే రామ్చరణ్. తమిళంలో విజయ్ సేతుపతి చేసిన ఒక సినిమాను రీమేక్ చేయడానికి అతను రెడీ అయినట్టు సమాచారం. అయితే ఆ సినిమాలో విజయ్ సేతుపతిని కూడా ఒక కీలక పాత్రలో తీసుకునే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఆ సినిమా హక్కుల కోసం సినిమా నిర్మాతకు పది రోజుల నుంచి రామ్ చరణ్ ఫోన్ చేస్తున్నా సరే ఆ నిర్మాత దొరకడం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి ఇప్పుడు. రామ్ చరణ్ ఏ విధంగా అయినా సరే ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ఆలోచనలో ఉన్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిజమా కాదా అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాలి. కాని చిరంజీవి మాత్రం ఒక మంచి కథ రామ్ చరణ్ కి చెప్పినట్టు తెలుస్తుంది. దీనితో ఇప్పుడు తండ్రి చెప్పిన కథ చెయ్యాలా లేక తమిళ సినిమా కథ చెయ్యాలా అనేది అర్థంకాక కాస్త డైలమాలో ఉన్నాడట చెర్రీ..?