క్రేజీ డైరెక్టర్ అనీల్ రావిపూడికి నందమూరి ఫ్యామిలీ అంటే విపరీతమైన అభిమానం. దీనికితోడు తనకు దర్శకుడుగా మొదటి అవకాశాన్ని ఇచ్చిన కళ్యాణ్ రామ్ గురించి అనీల్ రావిపూడి గురించి అవకాశం వచ్చినప్పుడల్లా చెపుతూనే ఉంటాడు. ఇలాంటి పరిస్థితులలో ఈ డైరెక్టర్ ఈ లాక్ డౌన్ సమయంలో తన ఇంటిలో కూర్చుని చాల వేగంగా ‘ఎఫ్ 3’ కథను పూర్తి చేసాడు.


వాస్తవానికి ఈ సినిమాను నిర్మించడానికి దిల్ రాజ్ ఈ మూవీలో నటించడానికి వెంకటేష్ వరుణ్ తేజ్ లు ప్రాధమిక అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. దీనితో అనీల్ రావిపూడి చాల వేగంగా ఈ కథను పూర్తి చేసి దిల్ రాజ్ వెంకటేష్ వరుణ్ తేజ్ లు ఓకె అంటే తిరిగి షూటింగ్ లు ప్రారంభం అయ్యాక వెంటనే మొదలుపెట్టి వేగంగా పూర్తిచేసి వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో నిలబెట్టాలని అనీల్ రావిపూడి ఎన్నో కలలు కన్నాడు.


అయితే కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ లు ఆగిపోవడంతో దిల్ రాజ్ ఆలోచనలు మారిపోవడమే కాకుండా వెంకటేష్ కూడ ‘ఎఫ్ 3’ మూవీని వచ్చే ఏడాది మొదలుపెడదాము అన్న సూచనలు చేసినట్లు తెలుస్తోంది. దీనికితోడు దిల్ రాజ్ అనేక సినిమాల పై ఇప్పటికే పెట్టుబడి పెట్టిన పరిస్థితులలో సినిమాల రిలీజ్ మొదలై అనేక సినిమాల పై పెట్టిన తన పెట్టుబడి జాగ్రత్తగా రాబట్టుకుని ఆతరువాత నెమ్మదిగా ‘ఎఫ్ 3’ ని తీద్దాము అనే సూచనలు దిల్ రాజ్ నుండి అనీల్ రావిపూడికి ఇప్పటికే చేరాయి అని తెలుస్తోంది.


దీనితో షాక్ కు గురైన అనీల్ రావిపూడి ఈమధ్యనే బాలయ్యను కలిసి ఒక పవర్ ఫుల్ స్టోరీని చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి త్రివిక్రమ్ జూనియర్మూవీ ప్రాజెక్ట్ ను నిర్మించవలసి ఉన్న కళ్యాణ్ రామ్ ప్లాన్స్ ప్రస్తుతం కరోనా సమస్యలు వల్ల వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో ఇప్పుడు ఈ గ్యాప్ లో అనీల్ రావిపూడి బాలయ్యల కాంబినేషన్ లో ఒక మూవీని త్వరగా పూర్తిచేయగాలిగితే తనకు అన్ని విధాల భాగుంటుందని కళ్యాణ్ రామ్ ‘ఎఫ్ 3’ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్న పరిస్థితులలో బాలయ్య వైపు యూటర్న్ తీసుకుంటే బాలయ్యతో సినిమా చేయాలి అన్న అనీల్ రావిపూడి చిరకాల కోరిక తీరడంతో పాటు ‘ఎఫ్ 3’ వచ్చే ఏడాదికి వాయిదా పడినా తన విలువైన కాలం వృథా కాకుండా బాలయ్యను స్టాండ్ బై గా ఉపయోగించుకోవాలని అనీల్ రావిపూడి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: