టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల `అల వైకుంఠపురములో` సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకుని ఫుల్ జోష్లో ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం ఈయన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్తో `పుష్ప` సినిమా పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కనున్నట్టు ఇప్పటికే అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై తెరకెక్కస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్తో జత కడతాడు అన్నది హాట్ టాపిక్గా మారింది. అయితే ఇలాంటి సమయంలోనే ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమా.. కేవలం ఈ నాలుగు సినిమాలతోనే టాప్ డైరెక్టర్గా ఎదిగిన కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈయన మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్నాడు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమా తర్వాత బన్నీతో సినిమా చేయాలని అల్లు అరవింద్, కొరటాలను కోరినట్టు సమాచారం.
అంతేకాదు, బన్నీతో సినిమా చేసేందుకు కొరటాలకు అల్లు అరవింద్ 13 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే బన్నీ, కొరటాల మధ్య ప్రాధమిక చర్చలు మొదలయ్యాయని టాక్ వినిపిస్తోంది. ఇక లాక్ డౌన్ లోనే కొరటాల బన్నీకి స్టోరీ లైన్ వినిపించారని.. బన్నీ కూడా ఆ లైన్ పై ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరి కాంబోలో ఓ సినిమా ఖచ్చితంగా ఉండబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే టాలీవుడ్లో మరో క్రేజీ కాంబో ఫిక్స్ అయినట్లే అవుతుంది.